26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆడియో మోజిలు వచ్చేస్తున్నాయ్

 కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్ తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఏమో చేయలేని పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైనది ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్ కూడా వర్తింపచేయాలని గూగుల్ సరికొత్త ఆలోచన చేస్తోంది ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్ యానిమేషన్స్ తో కూడిన ఆడియో మోజీలను యూజర్లకు పరిచయం చేయబోతోంది ఈ సరికొత్త ఫీచర్ను గూగుల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది ఆడియో మోజీ గా పిలుస్తున్న ఈ ఫీచర్లో సాడ్ అప్ లాజ్ సెలబ్రేట్ లాఫ్ డ్రం రూల్ ప్రూఫ్ అని ఆరు రకాల ఆడియో ఎమోజిల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు మనకు ఫోన్ చేసిన వ్యక్తి స్మార్ట్ఫోన్ తెరపై ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్తో యానిమేటెడ్ ఆడియో ఎమోజి దృశ్య రూపంలో కనబడుతుంది గూగుల్ యాప్ లోని కాల్ స్క్రీన్ ఫీచర్ను ఎంచుకోవడం ద్వారా ఇది ప్లే అవుతుంది దీనిపై గూగుల్ అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది

ప్రైమరీ డెంగ్యూ చాలా డేంజర్

 ప్రైమరీ డెంగ్యూ మొదటిసారి సోకడం కన్నా సెకండరీ డెంగ్యూ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమన్న భావన ఇప్పటివరకు ఉంది అయితే ఇది నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది సెకండరీ న్యూ కన్నా ప్రైమరీ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమని దీనివల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని భరత్ అమెరికా సైంటిస్టుల సంయుక్త పరిశోధన తెలిపి చాలా వరకు డెంగ్యూ చికిత్స వ్యాక్సిన్ల తయారీ అభివృద్ధి అంతా కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ చుట్టూనే తిరుగుతున్నదని ఈ వ్యాధి పట్ల మన అవగాహనను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని సైంటిస్టులు చెప్పారు

మసాలాలతో క్యాన్సర్ కు వైద్యం

 మద్రాస్ ఐఐటీకి దక్కిన పేటెెంటు జంతువులపై ప్రయోగాలు సక్సెస్ త్వరలోనే మనుషులపై ట్రైల్స్ 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యము ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు ఈ ఔషధంపై క్లినికల్ ట్రైయాల్స్ నిర్వహించి 2028 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐఐటి మద్రాస్ లోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజు అని తెలిపారు ఊపిరితిత్తులు రొమ్ము పెద్దపేగు గర్భాశయ నోటి థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానో మెడిసిన్ తో నయం చేయవచ్చని ఐఐటి మద్రాస్ పరిశోధకులు నిరూపించారు ఈ ఔషధంతో క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపారు జంతువులపై ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రైల్స్ చేపట్టనున్నారు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు నాగరాజున్ తెలి పారు