26, ఫిబ్రవరి 2024, సోమవారం

మసాలాలతో క్యాన్సర్ కు వైద్యం

 మద్రాస్ ఐఐటీకి దక్కిన పేటెెంటు జంతువులపై ప్రయోగాలు సక్సెస్ త్వరలోనే మనుషులపై ట్రైల్స్ 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు వంటింట్లో నిత్యము ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు ఈ ఔషధంపై క్లినికల్ ట్రైయాల్స్ నిర్వహించి 2028 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐఐటి మద్రాస్ లోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజు అని తెలిపారు ఊపిరితిత్తులు రొమ్ము పెద్దపేగు గర్భాశయ నోటి థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానో మెడిసిన్ తో నయం చేయవచ్చని ఐఐటి మద్రాస్ పరిశోధకులు నిరూపించారు ఈ ఔషధంతో క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపారు జంతువులపై ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రైల్స్ చేపట్టనున్నారు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు నాగరాజున్ తెలి పారు

లోకో పైలట్లు లేకుండానే 70 కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు

 లోకో పైలట్లు లేకుండానే ఒక గూడ్స్ రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది ఆదివారం ఉదయం 7:25 నిమిషాల నుంచి 9 గంటల మధ్య జరిగిన ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలోమీటర్లు ప్రయాణించిన ఇలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు 53 వేగన్లతో చిప్ స్టోన్స్ ను మోసుకొని జమ్మూ నుంచి పంజాబ్ వైపు రైలు బయలుదేరింది డ్రైవర్ చేంజ్ కోసం జమ్మూలోని కథ రైల్వే స్టేషన్లో రైలు నిలిపారు ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికి రైలు నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకెళ్లింది ఆ సమయంలో రైలులోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు తెలిపారు నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత వేగం పుంజుకుంది చివరికి పంజాబ్ లోని ఉంచి బస్సు రైల్వే స్టేషన్లో ఆగింది ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్ము డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన

 భారతదేశంలోని అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్ లోని ద్వారక జిల్లాలో గల మోకాను బెట్టు ద్వారకతో అనుసంధానిస్తుంది 979 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది