25, ఫిబ్రవరి 2024, ఆదివారం

పరిమళంతో జ్ఞాపకం

 అమ్మకి ఇస్తే జాగ్రత్తగా దాస్తుందని పిల్లలు వస్తువులను మనకు ఇస్తారు తీరా తిరిగి వాళ్ళు అడిగినప్పుడే చిక్కంతా వస్తుంది. జాగ్రత్తగా దాచి పెట్టామని మాత్రమే గుర్తుంటుంది అయితే ఎంతకు జ్ఞాపకం రాదు వంటి ఎదురైనప్పుడు జ్ఞాపకశక్తి దూరమవుతుంది అలాగే మెనూ పాజి సమయంలోను ఇది తగ్గుతుంది దీని తిరుగు తీసుకురావడంలో పరిమళ ద్రవ్యాలు సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి మెదడులో మరుగున పడే జ్ఞాపకాలను తిరిగి పరిమళ ద్రవ్యాల వాసనలతో బయటకు తేవచ్చు అని పిక్స్బర్కు స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధక బృందం తాజాగా ఒక అధ్యయనంలో తీర్చండి. జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం తీవ్రంగా ఆలోచించేటప్పుడు మెదడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది అయితే తీవ్ర ఒత్తిడి వల్ల మెదడులోని అక్కడి భాగం నియంత్రణకు గురవుతుంది ఈ సమస్య ఉన్న కొందరికి కాఫీ గింజలు లవంగాలు నారింజ ఎసెన్షియల్ ఆయిల్ వంటి వాటితో చేసిన కొన్ని రకాల పరిమళ ద్రవ్యాల వాసనలను చూపించారు దానితో దూరమైన వారి జ్ఞాపకాలు క్రమేపీ తిరిగి రావడం మొదలయ్యాయి అలాగే పలు రకాల సమస్యలతో కొంగుబాటుకు గురయ్యే వారి విషయంలో కూడా కౌన్సిలింగ్ కన్నా పరిమళ ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తీర్చారు చిన్న చిన్న విషయాలను కూడా ఒత్తిడి మరిచిపోయేలా చేస్తోంది అందుకే ఉదయం ఇంటి పని మొదలుపెట్టేటప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు గతిని సహజ సిద్ధ పరిమళాలతో నింపితే చాలు జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.

రేషన్ కార్డు ఈ కేవైసీ ఈనెలాఖరుతో ముగుస్తున్న గడువు

 రేషన్ కార్డుకు ఈ కేవైసీ గడవు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది ఇప్పటికే గడువును రెండు మార్లు పొడిగించిన ఆశించిన స్పందన రావడం లేదు ఈ కేవైసీ చేయించడంలో తీవ్ర జాప్యం కలుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులలో కేవలం 5% మంది లబ్ధిదారులు మాత్రమే చేయించుకున్నారు మిగతావారు ఆధార్ అప్డేట్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో కలిపి 78.84 శాతం మంది ఈ కేవైసీ నమోదు పూర్తయినది ఇంకా నాలుగు లక్షల 5379 మంది చేయించుకోవలసి ఉంది

బియ్యం సరఫరా నిలిచిపోతుంది రేషన్ కార్డుకు ఈ కేవైసీ పూర్తి చేయించుకోకుంటే బియ్యం సరఫరా నిలిచిపోనున్నది రేషన్ కార్డులో పేర్లు నమోదయి ఉన్న లబ్ధిదారులు అసలైనవారా లేదా అనేది తెలుసుకోవడానికి కేంద్రం ఈ ప్రక్రియ చేపట్టినది ఉమ్మడి జిల్లాలో 60 శాతం ఈ కేవైసీ నెల రోజుల్లోనే పూర్తయింది మిగతా 18 శాతం పూర్తికావడానికి సుమారు రెండు నెలల సమయం పట్టింది చాలామంది ఆధార్ నవీకరించుకోకపోవడం చిన్నారుల వేలిముద్రలను అప్పుడే చేయించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది 

మరో నెల సమయం ఇస్తేనే..

 చాలామంది అర్హులు ఈ కేవైసీ నమోదు చేయించుకోలేకపోతున్నారు ఇప్పటికే రెండు మార్లు గడువు పెంచిన ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పెంచితే నమోదు శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది కొన్ని చోట్ల రేషన్ డీలర్లు అందుబాటులో లేక ప్రక్రియ నిమ్మదిస్తోంది ఈ కేవైసీ నమోదు కోసం డీలర్లు వారి దుకాణాల్లో ఉదయం సాయంత్రం కొంత సమయం కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు

ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి

 ఒక్కసారి మీ ఎల్ఐసి పాలసీ గడవు తీరిపోతే మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని తీసుకోవలసి ఉంటుంది .అయితే కస్టమర్లు ఎందుకోసం క్లెయిమ్ చేసుకోవాలి .ఆన్లైన్లోనూ ఈ మెచ్యూరిటీ క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా ఇన్దుకు వీలున్నది.

 పాలసీదారులు ఏం చేయాలంటే ..

ముందుగా పాలసీదారులు తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచిస్తుంది. అలాగే పాలసీ సొమ్మును పొందేందుకు కేవైసీ ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

 ఎండోమెంట్ మెచ్యూరిటీ క్లెయిమ్స్..

 ఎండోమెంట్ పాలసీలు గడవు తీరిన తర్వాత చెల్లింపులు జరుగుతాయి. ఈ మేరకు పాలసీ వ్యవధి పూర్తవడానికి కనీసం రెండు నెలల ముందు అయినా సంస్థ తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. కావాల్సిన పత్రాలను సమర్పిస్తే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుంది. పూర్తయిన డిశ్చార్జి ఫామ్, పాలసీ డాక్యుమెంట్, నెఫ్ట్ ఫార్మ్, కేవైసీ వంటివి అవసరము .

మనీ బ్యాక్ పాలసీలలో..

 ఐదు లక్షల రూపాయల దాకా మొత్తాల చెల్లింపులకు పాలసీ డాక్యుమెంట్తో పనిలేదు .జీవనా నంద్ ప్లాన్ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా పాలసీ బాండ్ల అవసరం లేదు. ఈ రకమైన పాలసీలలో పాలసీ వ్యవధి మొత్తంగా నగదు భరోసా ఉంటుంది. కాలానుగున చెల్లింపులు  ఉంటాయి.

డెత్ క్రైమ్ లు ..

బకాయిలు లేకుండా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వ్యవధిలోనే మరణం సంభవించాలి .అలాగే క్లైమ్ ఫామ్ ఎల్లో క్లెయిమ్ చేస్తున్నవారు మృతుల వివరాలన్నింటినీ పేర్కొనాలి .డెత్ సర్టిఫికెట్ను సమర్పించాలి .ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ పాలసీదారు ని వయస్సు పేర్కొనకపోతే ఏజ్ సర్టిఫికెట్ అవసరము . రిస్క్ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన మూడేళ్ల లోపు మరణం సంభవిస్తే క్లైమ్ ఫామ్ బి అవసరము. ఇందులో పాలసీదారుడు చనిపోయిన చివరి రోజులలో వారికి సేవలందించిన వారి ద్వారా మెడికల్ అటెండెన్స్ సర్టిఫికెట్ని ఇవ్వాలి .దవాఖానాలో చికిత్స తీసుకుంటే క్లెయిమ్ ఫామ్ బి వన్ అవసరము. ఆఖరి రోజుల్లో చికిత్సలు అందించిన వైద్యుడు చె క్లెయిమ్ఫా ఫామ్ బి టు తీసుకోవాలి. తెలిసిన వారిచే గుర్తింపు అంత్యక్రియలకు సంబంధించి క్లీన్ ఫామ్ సీ నీ ఇవ్వాల్సి ఉంటుంది .చనిపోయిన పాలసీ దారుడు ఉద్యోగి అయితే వారి సంస్థ చేత క్లెయిమ్ ఫామ్  ఈ నీ ఇప్పించాలి.