పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ టౌన్ కు చెందిన బిర్జు దత్తాద్రి ఎన్నికయ్యారు పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక కోసం ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించగా అధ్యక్ష పదవికి బిజ్జు దత్తాత్రే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పులగం హనుమాన్లు ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం ట్రెజరర్ గా గుడ్ల భూమేశ్వర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దత్తాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో శనివారం ఆర్మూర్లోని ఆయన నివాసంలో 8వ తర్ప అధ్యక్షుడు కొక్కుల రమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చిలుక కిష్టయ్య బొడ్డు గంగాసాగర్ బండి రాజు దాసరి కృష్ణ మేక శ్రీను బ్రహ్మదండి దిలీప్ దాసరి రాధా కిషన్ పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
రాయిని మడత పెట్టి
ఇరవై టన్నుల బరువు ఉన్న బండరాయిని మడత పెట్టడం సాధ్యమా మరి ఇక్కడ కుర్చీ మడతపెట్టినంత ఈజీగా మడత పెట్టేశారు చూశారా ఫోల్డ్ సిరీస్ లో భాగంగా గ్రానైట్ రాయితో ప్రముఖ శిల్పి జాతీయ అవార్డు గ్రహీత దుర్గడ్డ హరిప్రసాద్ ఆచారి ఈ ఆధునిక శిల్పాన్ని మలిచారు హైదరాబాదులోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా న్యూస్ లో ఈ మడత శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచారు అసలు రాయని ఎలా మడత పెట్టారు అనేది శిల్పంగా తీర్చిదిద్దారు సాధారణంగా మనం ఏదైనా కఠినమైన దాన్ని బండరాయితో పోలుస్తాం. అందులోనూ గ్రానైట్ అత్యంత కఠిన శిల దీనికి పూర్తి భిన్నంగా మనిషి సున్నిత మనస్కుడు అయితే మనుషులు తలుచుకుంటే ఎంత కఠినమైన రా ఇలాంటి దానైనా తమకు నచ్చినట్లుగా మార్చేయగలరని ఈ శిల్పాల ఉద్దేశం అని హరిప్రసాద్ చెప్పారు మార్చి 7 వరకు మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగే న్యూస్ ఆర్ట్ ఫస్ట్ ఎగ్జిబిషన్లు ఇలాంటి అనేక శిల్పాలు సందర్శకులు ఆదర్శించడానికి ఆకర్షించడానికి సంసిద్ధంగా ఉన్నాయి మరెందుకు ఆలస్యం చలో మరి
19న రక్తదాన శిబిరం
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆస్పత్రిలో ఈనెల 19న రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర జగద్గురువు నరేంద్ర చార్య మహారాజ్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు రక్తదానం చేసేవారు 7386694757కు ఫోన్ చేయవచ్చని తెలిపారు



