7, ఫిబ్రవరి 2024, బుధవారం

యూపీఐతో రైలు టికెట్లు

 రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ లావాదేవీలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త జనరల్ టికెట్ కొనుగోలు సమయంలో ప్రయాణికులు ఇకపై చిల్లర కోసం జేబులు తడుముకోవాల్సిన పనిలేదు రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ల వద్ద యూపీఐ లావాదేవీలు చేయవచ్చు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేసేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది యూపీఐ యాప్ లేదా డెబిట్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంది ఇందుకోసం తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 466 పిఓఎస్ కేంద్రాలు యూపీఐ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం అండ్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం కౌంటర్లలో ఇవి అందుబాటులో  ఉన్నాయని తెలిపారు.

డీప్ ఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు దోపిడీ

 డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నీరగాళ్లు ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి 2007 కోట్ల రూపాయలు కొట్టేశారు ఆ కంపెనీకి చెందిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశారు ఆపై వీడియో కాల్ చేసి వ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఆదేశించారు దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ ను ముగించారు ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది తమ మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో టీవల జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది

వీడియో కాల్ చేసి నమ్మించారు స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో పాటు కీలక సిబ్బంది ముక్కాలను డీప్ ఫేక్ చేశారు వాళ్ళ మాట తీరును మక్కికి మక్కి కాపీ కొట్టారు ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకుని హాంగ్కాంగ్ బ్రాంచ్ లోని అకౌంటెంట్ కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు అంతకుముందే సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతన్ని అలర్ట్ చేశారు గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుతున్న బాస్ తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీ వాళ్ళే కావడంతో అకౌంటెంట్ కు ఏ మాత్రం అనుమానం రాలేదు. వీడియో కాల్ లో వాళ్ళు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు 27 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంపెనీ హెడ్ ఆఫీస్ కు వెళ్లగా తనను మోసం చేశారని పేర్కొని పోలీసులను ఆశ్రయించారు అయితే ఆ కంపెనీ పేరు ఏంటో కూడా వెల్లడించని పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్ట్ తెలిపింది.



భారత్ రైస్ అమ్మకాలు షురూ

 



కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యాపతులు భారత రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పియుష్ గోయల్ ప్రారంభించారు భారతదేశ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయల చొప్పున ఐదు పది కిలోల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి మొదటి పేజీలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైసును విక్రయిస్తారు ఇందుకోసం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనున్నది. భారత రైస్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుంది