1, ఫిబ్రవరి 2024, గురువారం

వాలీబాల్ విజేత మగ్గిడి జట్టు

 ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఉపకాల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో అండర్ 17 జిల్లా స్థాయిలో బాలబాలికలకు ఒకరోజు వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు వాలీబాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ మగిడి జట్టు బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో కలిగోట్ జడ్పీహెచ్ఎస్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ పోచంపాడు ప్రథమ ద్వితీయ స్థానం కాకతీయ ఉన్నత పాఠశాల నిజామాబాద్ జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా బాలురకు కబడ్డీ పోటీలు సైతం చేపట్టారు ఇందల్వాయి జట్టు ప్రథమ బాల్కొండ కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపొందిన జట్లకు ప్రథమ జట్టుకు పదివేల రూపాయలు ద్వితీయ జట్టుకు 5000 రూపాయలతో పాటు షీల్డ్లను అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు భూమేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి బద్దం నరసారెడ్డి మోత గంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ టి సాయన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య పుష్ప నాథ్ గోపీనాథ్ జిల్లా కమిటీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే గంగాధర్ పిడి రాజకుమార్ మల్లేష్ గౌడ్ పీఈటీలు పాల్గొన్నారు



31, జనవరి 2024, బుధవారం

4 న గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

 గురుకుల ప్రతిభ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు బుధవారం తెలిపారు జిల్లాలోని ధర్మారం బి కంజర ఆర్మూర్ బి శుద్ధపల్లి పోచంపాడు నవీపేట్ కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి భిక్కనూరు దోమకొండ తాడువాయి తాడుకు కొయ్యగుట్ట తక్కడపల్లి పెద్ద కోడప్పగల్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పెద్దయకులారా బాన్సువాడ బోర్లా నిర్మల్ జిల్లాలో ముధోల్ లెఫ్ట్ పోచంపాడు జాం కడెం భయంసాలోని పరీక్ష కేంద్రాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించాలని అన్నారు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందాలని తెలిపారు.




ఓ టి ఎస్ గడువు మార్చి 31 వరకు పొడగింపు

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏకకాల పరిష్కార పథకం వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ చైర్మన్లు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల అభ్యర్థుల మేరకు ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకం జనవరి 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే దీంతో ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడగించి నట్లు పేర్కొన్నారు మార్చి 31 2023 నాటికి కాలపరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేసిన సొసైటీలో తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాది వాయిదా మీరిన వడ్డీ పైన 30% వడ్డీ మాఫీ చేస్తామన్నారు దీర్ఘ కాలిక జేఎల్సి ఎస్ హెచ్ జి రుణాలపై వాటి 32 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు కావున అర్హులైన రుణ గ్రహీతలు ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు మిగతా వివరాల కోసం సంబంధిత సొసైటీలు బ్రాంచ్ మేనేజర్లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు