31, జనవరి 2024, బుధవారం

ఓ టి ఎస్ గడువు మార్చి 31 వరకు పొడగింపు

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏకకాల పరిష్కార పథకం వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ చైర్మన్లు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల అభ్యర్థుల మేరకు ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకం జనవరి 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే దీంతో ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడగించి నట్లు పేర్కొన్నారు మార్చి 31 2023 నాటికి కాలపరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేసిన సొసైటీలో తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాది వాయిదా మీరిన వడ్డీ పైన 30% వడ్డీ మాఫీ చేస్తామన్నారు దీర్ఘ కాలిక జేఎల్సి ఎస్ హెచ్ జి రుణాలపై వాటి 32 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు కావున అర్హులైన రుణ గ్రహీతలు ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు మిగతా వివరాల కోసం సంబంధిత సొసైటీలు బ్రాంచ్ మేనేజర్లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు



రగ్బీ పోటీలకుచిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక

 కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని శాంతినికేతన్ విద్యాలయ పాఠశాల విద్యార్థులు నలుగురు యాదాద్రి భువనగిరిలో నిర్వహించబోయే రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల విద్యార్థులు రిషిక దివ్య అభిలాష్ రిషిత గౌడ్లు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి రాజు శివాజీ ఉన్నారు



హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం ఏర్పాటు

 హనుమాన్ పండరీనాథ్ ట్రస్ట్ కార్యవర్గం 2024 ఏర్పాటు

తాడ్వాయి మండల కేంద్రంలో హనుమాన్ శబరిమాత పండరీనాథ్ మహారాజ్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మద్దిమహేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆకిటి రాజిరెడ్డి కోశాధికారిగా అంబీర్ శ్యామ్ రావు ప్రధాన కార్యదర్శిగా వాంకోజి శ్యామ్ రావు తదితరులను ఎన్నుకున్నారు సర్పంచ్ సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు బీడీసీ చైర్మన్ రాజు గ్రామ పెద్దలు సాయి రెడ్డి వెంకట్రామిరెడ్డి స్వామి రెడ్డి ఉన్నారు.