31, జనవరి 2024, బుధవారం

న్యాయ పాలనలో శిక్షణ

 న్యాయ పాలన అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ లో 2023 24 సంవత్సరంలో శిక్షణ పొందడానికి జిల్లాలోని అర్హులైన బీసీ న్యాయ శాస్త్ర పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు మున్సిపల్ లో ఉన్నవారికి మించకూడదని అన్నారు శిక్షణ కాలంలో మూడు సంవత్సరాల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేనా ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు మొదటి సంవత్సరంలో పుస్తకాలు ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం 3000 రూపాయలు మంజూరు చేస్తారని తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం కామారెడ్డిలో ఈ నెల 31వ తేదీ వరకు స్వయంగా అందించాలని సూచించారు



30, జనవరి 2024, మంగళవారం

ఉచిత నేత్ర వైద్య శిబిరం

 లైన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక క్లబ్ కార్యాలయంలో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు 30 మందికి కంటి పరీక్షలు చేయగా నలుగురికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారించామని వైద్యుడు సతీష్ తెలిపారు క్లబ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ విటల్ గాలయ్య కిషోర్ సంతోష్ హనుమాన్లు సూర్యప్రకాష్ ఉన్నారు

టిపిజెఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

 టీ పి జేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం సుందరయ్య కళానిలయంలో జరిగింది కొత్త 33 జిల్లాల కమిటీ సభ్యులు పాత పది జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తం 53 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 40 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గౌరీ సతీష్ 27 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల బోధనా రుసుము బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.