29, మార్చి 2024, శుక్రవారం

ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది

షుగర్ ముప్పును పక్కాగా గుర్తించవచ్చు

 వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో నిర్ధారణ అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు

మారిన జీవనశైలి ఆహార పలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4% అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు దేశ జనాభాలో 15.3% అంటే 13.6 కోట్ల మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు. ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది వెంటనే అప్రమత్తమై జీవనశైలి ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క అయితే ఫ్రీ డయాబెటిక్ స్టేజిలో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం ఇన్దుకుగా ను వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష 1 hpg ను ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సిఫారసు చేసింది ఈ పరీక్ష ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చు అని చెబుతోంది ఐ డి ఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్థ ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది సాధారణంగా ఫ్రీ డయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజు టాలరెన్స్ లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కానీ ఖచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్నవారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఐడిఎఫ్ చెబుతోంది వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్లు పరిగణిస్తారు.209mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్లు లెక్క..

డి ఓ టి పేరుతో వచ్చే కాల్స్ తో జాగ్రత్త

 కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు సూచనలు చేసింది మొబైల్ నెంబర్లు కనెక్షన్లు తొలగిస్తామని మీ నెంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాలలో దుర్వినియోగం అయ్యిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్లు చెప్పి బెదిరింపు కావాల్సిన నమ్మవద్దని సూచించింది విదేశీ మొబైల్ నెంబర్లతో ప్రెస్ 92 తో మొదలయ్యేలాంటి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించిన నమ్మవద్దని చెప్పింది తమ శాఖ తరఫున ఎవరు అలాంటి ఫోన్ కాల్స్ చేయాలని స్పష్టం చేసింది