29, మార్చి 2024, శుక్రవారం

మానసిక రుగ్మతలకు చికిత్స అవసరం..14416

 


అతి కోపం నిరాశ నిస్ స్పృహ ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలను అధిగమించడం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సలహాలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రమణ పిలుపునిచ్చారు బుధవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వ్యాధుగ్రస్తులకు చికిత్స అవగాహన కల్పించారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ మాట్లాడుతూ మానసిక సమస్యలున్న వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మతిమరుపు నిద్రలేమి అతని గ్రాఫిక్స్ అతికోపము ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు ఆల్కహాల్ సంబంధిత వాటిని మాన్పించుటకు వైద్య సలహాలు తీసుకోవాలన్నారు ఒంటరితనం భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని డాక్టర్ రమణ తెలిపారు జిల్లా మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త డాక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ జాతి ఆరోగ్య మిషన్ ద్వారా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అవసరమయ్యే వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఉంటుందని వ్యాధిగ్రస్తులు మొహమాటం లేకుండా వారికి మానసిక సమస్యలు తలెత్తితే నేరుగా వైద్యులను సంప్రదించాలన్నార

ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 నీ సంప్రదించి మానసిక వైద్య సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్ సూపర్వైజర్ జానకి ఫార్మసిస్ట్ రాజు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

28, మార్చి 2024, గురువారం

దేవునిపల్లి కి చెందిన దేవల సంజయ్ అదృశ్యం

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లికి చెందిన దేవల సంజయ్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శ్రీలత పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇటీవల ఇంటిని నిర్మించిన సంజయ్ కు అప్పులు పెరిగినట్లు తెలిసింది



వృద్ధుడి అదృశ్యం

 కామారెడ్డి మండలం లింగాయపల్లి కి చెందిన తొట్ట భూమయ్య 70 సంవత్సరాలు అదృష్టమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు గురువారం తెలిపారు ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భూమయ్య ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికిన రాజకీయ లభించకపోవడంతో భూమయ్య కూతురు మమతా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఎస్సై రాజు తెలిపారు