5, మార్చి 2024, మంగళవారం

ఆధ్యాత్మిక సమాచారం మార్చి 5 2024

  అయోధ్య భక్తులను సత్కరించిన మాజీ జెడ్పిటిసి

గాంధారి మండలం నుండి గత వారం రోజుల క్రిందట అయోధ్య రామ మందిరానికి బయలుదేరి స్వగ్రామానికి క్షేమంగా తిరిగి వచ్చిన భక్తులందరికీ సత్కరించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తనాజిరావు వారి వెంట పడగల రాజేశ్వరరావు బిజెపి మండల అధ్యక్షులు సాయిబాబా శివాజీ రావు శ్రీకాంత్ మహారాష్ట్ర భక్తులు తదితరులు పాల్గొన్నారు



భక్తిశ్రద్ధలతో మల్లన్న కళ్యాణోత్సవం

కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు స్వామివారికి అగ్నిగుండాలలో నడవడం అన్నదానం చేశారు మల్లన్న పట్నాలు వేసి ఒగ్గు కథ అని చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం యువజన సంఘం ప్రతినిధులు స్థానికులు పాల్గొని పూజలు చేశారు



శివ స్వాముల పల్లకి సేవ

భిక్కనూరు మండల కేంద్రంలో శివ స్వాములు పల్లకి సేవ ఊరేగింపు సోమవారం నిర్వహించారు వాహనంపై లింగములు ప్రతిష్టించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు శ్రీ సిద్ధ రామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ శివ స్వాములు రామదండు ప్రతినిధులు పాల్గొన్నారు

నసురుల్లాబాద్ మండలంలోని దొరికి సోమలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అనంతరం ఆవరణలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన వెంట మాజీ సర్పంచ్ దుర్గం శ్యామల నాయకులు మోహన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు


ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఎదవ సంఘం నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు

అలరించిన నృత్యోత్సవం

మహాశివరాత్రి పురస్కరించుకొని కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యం అలరించింది తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరై ప్రదర్శన ఇచ్చారు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా శ్రీ వేద విద్యానంద గిరి స్వామి గాయకుల భిక్షునాయక్ సుజాశ్రీ హాజరయ్యారు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో టిపిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అందరూ మనోహర్రావు సనాతన సంస్థ వ్యవస్థాపకుడు మాలోతు నవీన్ శ్లోకబడి ఛైర్మన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు



అయోధ్య రాముడు దర్శనానికి భక్తులు



కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు రామభక్తులు దర్శనానికి సోమవారం బయలుదేరారు 1453 మంది భక్తులతో వెళుతున్న రైలును భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు బాలరాముడు దర్శనానికి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని భక్తులు అయోధ్యకు వెళ్తున్నారన్నారు వారికి తీర్థయాత్ర ట్రస్ట్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి వసతులు కల్పిస్తున్నారని అన్నారు అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ కౌన్సిలర్లు అవధూత నరేందర్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు



4, మార్చి 2024, సోమవారం

అరణ్య అర్బన్ పార్క్ మాక్లుర్ మండల్

  అడవిలో అద్భుతం దట్టమైన అడవి ప్రాంతము పక్షుల కిలకిల రావాలు జంతువులు అరుపులు నెమలి నాట్యాలు మాకూరు మండలంలోని చిన్నాపూరు శివారులో 63వ జాతీయ రహదారి పక్కన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు చేస్తోంది నిజామాబాదుకు ఐకానిక్గా నిలుస్తుంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలి అందమైన కుందేళ్ళు చెంగుచెంగున ఎగిరే జింకలు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం అటవీ శాఖ కల్పిస్తోంది ఈ పార్కు సుమారు 413 ఎకరాల విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల సరిహద్దు కలిగి 13 కోట్లతో అభివృద్ధి చేశారు పిల్లలకు పది రూపాయలు పెద్దలకు 20 రూపాయల టికెట్ అందుబాటులోకి అటవీశాఖ ఉంచింది స్కూల్ పిల్లలకు స్టడీ టూర్ లాగా కూడా ఉపయోగకరంగా ఉంది ప్రధాన ద్వారం నుండి అడవిలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నపిల్లలకు ఆడుకునేందుకు వీలుగా పార్క్ అక్కడక్కడ సేద తీరేందుకు ఫుడ్ టైప్ సిమెంటుతో తయారీ కుర్చీలు టేబుల్స్ ఏర్పాటు చేశారు పర్యాటకుల సౌకర్యార్థం నీటి వసతి ట్యాంకులు నిర్మించారు ఓపెన్ గ్లాస్ రూమ్ వాచ్ టవర్ అందంగా ఏర్పాటు చేశారు ఆకట్టుకునే విద్యుత్ దీపాలు బండరాళ్లతో అందంగా నిర్మాణాలు నిర్మించారు త్వరలోనే సఫారీ సైకిల్ అందుబాటులోకి తీస్తామన్నారు మార్కింగ్ వాకర్స్ పచ్చని వృక్షాల మధ్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్క్ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వచ్చే వేసవిలో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు




తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

 తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంఎం రహమాన్ ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్ ఆదివారం నాంపల్లిలోని టీజీవోస్ కార్యాలయంలో ఆ సంఘం కోర్ కమిటీ సమావేశమై నూతన కార్యవర్గని ఎన్నుకున్నది అధ్యక్షుడిగా రెహమాన్ ఎన్నికవ్వగా ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమేష్ బాబు కోశాధికారిగా యాటకర్ల మల్లేషు ఉపాధ్యక్షుడిగా కందుకూరి రమేష్ బాబు సాదిక్ పాషా పసునూరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జాయింట్ సెక్రటరీలుగా కాజీపేట నరేందర్ జనార్ధన్ డి సుమ బల సప్తగిరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్బాస్ ఎన్నికయ్యారు ఉద్యమ జర్నలిస్టుల సంఘం ప్రధాన సలహాదారుగా ఎండి మునీర్ ఢిల్లీ ప్రతినిధిగా పి సురేష్ ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది