2, మార్చి 2024, శనివారం

మూడున జిల్లాస్థాయి సైక్లింగ్ ఎంపికలు

 నిజామాబాద్ జిల్లా స్థాయి సైక్లింగ్ జట్ల ఎంపికలు ఈనెల 3 గంటలకు కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్రావు శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 9 10 తేదీలలో మెదక్ జిల్లాలో జరిగే ఎనిమిదవ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లు పాల్గొంటారని తెలిపారు.

సబల సత్యభామ చింతల పోశవ్వ

 పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవాకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవ్వకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోని వెంకటేశ్వర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సబల సత్యభామ పురస్కారానికి చింతల పోషవ్వ గారు ఎంపికయ్యారు పోషవ్వ తన దివ్య హస్తం ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవ్ ఎన్విరాన్మెంట్ వర్క్ లో భాగంగా కౌడంగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ నాయకురాలుగాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను సభల సత్యభామ అవార్డును ప్రముఖ సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి చేతులమీదుగా తీసుకున్నారు ఆమె చేస్తున్న సేవలకు గాను పురస్కారం అందుకోవడం పట్ల పలువురు సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు అభినందనలు తెలిపారు..





నేటి నుంచి హైదరాబాదులో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం

 ఐదున మహిళా దినోత్సవం సందర్భంగా శారీవాకతాన్

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఈ నెల రెండు నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ జాతీయ స్థాయి సాంస్కృతిక వేడుకలు జరుగుతాయి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తంతో దేశ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రానున్న తరాలకు వాటిని అందించేలా కార్యక్రమాలు నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశము దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తమ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆఖరి రోజున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శారీవాకతాన్ జరుగుతుంది ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల మహిళలు వారి ప్రాంతాలలో ధరించే చీరకట్లతో పాల్గొంటారు అని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు