2, మార్చి 2024, శనివారం

నేటి నుంచి హైదరాబాదులో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం

 ఐదున మహిళా దినోత్సవం సందర్భంగా శారీవాకతాన్

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఈ నెల రెండు నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ జాతీయ స్థాయి సాంస్కృతిక వేడుకలు జరుగుతాయి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తంతో దేశ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రానున్న తరాలకు వాటిని అందించేలా కార్యక్రమాలు నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశము దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తమ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆఖరి రోజున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శారీవాకతాన్ జరుగుతుంది ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల మహిళలు వారి ప్రాంతాలలో ధరించే చీరకట్లతో పాల్గొంటారు అని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు

ఏఐలో మహిళల వాటా ఎంత?

 ఆరోగ్యం రవాణా ఎంటర్టైన్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఇది అది అని లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ చొచ్చుకు పోయింది అంతెందుకు హే సిరి ok google అనగానే జీ హుజూర్ అని మనకు కావాల్సిన సమాచారం ఇస్తోంది అంతేనా ఆన్లైన్ షాపింగ్ కావాల్సిన చిరునామాకు మ్యాపు చూపించడం ఫోన్ సిస్టం సెక్యూరిటీ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోజువారి జీవితాలలో భాగమైపోయింది ఇంత ప్రాముఖ్యమైన ఈ రంగంలో మన వాటా ఎంతో తెలుసా 22 శాతమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహా ఎన్నో సంస్థల నివేదికలు చెబుతున్న మాట ఏ ఆయన్ని సమర్ధంగా వినియోగిస్తున్న పరిశోధన నిర్వహిస్తున్న ఫేస్బుక్ గూగుల్ లలో వరుసగా మహిళల శాతం 15 10 మాత్రమే కొన్ని రంగాలలో మన వాటా శూన్యం గా ఉందంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సమస్య అవకాశాలు లేక కాదు వాటి నందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న యువతులు తక్కువట అమ్మాయిలు పనికొచ్చే పనులు చేయాలి అని చెబుతూ టెక్నాలజీకి దూరంగా ఉంచడం వల్ల ఈ పరిస్థితి అంటున్నారు నిపుణులు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాలలో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడం మార్గం అంటున్నారు దీనికి బీజం పడాల్సింది ప్రాథమిక స్థాయిలోనే నట అంటే చాలా చిన్న వయసు నుంచే సాంకేతికతలు అబ్బాయిలతో సమానంగా ప్రోత్సహించాలి మర

ఇళ్లన్నీ మహిళల పేరు మీదే

 బాకాపూర్ మహారాష్ట్రలో 2000 గడపలున్న ఒక చిన్న గ్రామం ఊరు పెద్దలు తీసుకొచ్చిన ఒక మార్పు ఎంతో మంది ప్రశంసలు అందుకుంది అదేమిటంటే సాధారణంగా ఇల్లు మగవారి పేరు మీద ఉండడం చూస్తుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం ఊళ్లో ప్రతి ఇల్లు ఆ ఇంటి మహిళల పేరు మీదనే ఉంటుంది మగవారి పేరు మీద ఉండాల్సి వస్తే కోనరుగా మహిళ తప్పనిసరి అట ఇంటి ముందు నేమ్ ప్లేట్ పై యజమాని పేరు మహిళది. గతంలో వ్యసనాలకు బానిస అయిన కొందరు మగవాళ్ళు ఇంటిని అమ్మేయాలని ప్రయత్నించడంతో ఇతర కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివలన మహిళలకు ఇంటిపై హక్కు మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత ఉంటుందని భావించారట ఇప్పుడు భాకాపూర్ లో ఎవరైనా ఇంటిని కొనాలన్న అమ్మాలన్న అందుకు ఆ ఇంటి మహిళల అనుమతి తప్పనిసరి