భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక విధానాలపై పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు డ్రోన్ ద్వారా వారి మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలలో వస్తున్న ఆకుపచ్చ పురుగు ఆకుమూడత పేను బంక తదితర తెగుళ్లను నివారించడానికి డ్రోన్ ద్వారా మందులను పిచికారి చేయించడానికి ఎకరాకు 600 అవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రంజిత్ భూపతి అవగాహన కల్పించారు జంగంపల్లి గ్రామ రైతులు శశికాంత్ నర్సింహులు శ్రీనివాస్ భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
29, ఫిబ్రవరి 2024, గురువారం
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయ 60వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ఆవరణలో సాయంత్రం ఘనంగా చక్రతీర్థం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సీతారాం మధు సంతోష్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి అరవైవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం రేణుక ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఘనంగా చక్కెర తీర్థం జాతర జరిగింది రాత్రి 8 గంటల నుంచి శ్రీ సింగరాయపల్లి అంజయ్య శిష్యుల బృందం శ్రీ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ నాని ప్రభాకర్ రెడ్డి ఆశ పోయిన శ్రీనివాస్ కదిరి గోపాల్ రెడ్డి సీతారాం మధు సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తగారి శిరీష్ గౌడ్ సభ్యులు చిన్న పోష గౌడ్ స్వామి గౌడ్ భక్తులు పాల్గొన్నారు
ఇంటికే నేరుగా అయోధ్య హనుమంతుడి ప్రసాదం
అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇకనుండి భక్తుల ఇంటికి నేరుగా చేరనున్నది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ బాగా పెరిగింది దీనితో చాలా మంది భక్తులకు అనుమానం గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్మాస్టర్ అయోధ్యర్ధం 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి
ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగరాజు వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయి మనీ ఆర్డర్ కు లడ్డూలు హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు
