24, ఫిబ్రవరి 2024, శనివారం

ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

 మాచారెడ్డి గ్రామంలో ఫిబ్రవరి 13వ తారీకున నిర్వహించిన హెల్త్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైతే కంటి అద్దాలు అవసర పడ్డాయి వారికి శ్రీ ముత్యాల లక్ష్మీనరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహ రెడ్డి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఆపరేషన్ అవసరమయ్యే వారికి కూడా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పదిమందికి మొదటి విడుదల ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ రోజుల్లో పేదవారిని గుర్తించి ఆపరేషన్లు చేపిస్తూ అవసరమున్నవారికి కంటి అద్దాలు ఇస్తున్న ముత్యాల నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని గ్రామస్తులు వృద్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బంజారా నవీన్ రెడ్డి సంతోష్ రెడ్డి రామిరెడ్డి రాజిరెడ్డి కిషన్ గౌడ్ పాల్గొన్నారు

25న జన్పాక్ట్ కంపెనీ ఉద్యోగం ఎలా

 నిజామాబాద్ నగరంలో ఈనెల 25వ తేదీన జెన్ ప్యాక్ కంపెనీకి ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఒక ప్రకటనలో కోరారు జెన్ ప్యాక్ కంపెనీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం ఉద్యోగమేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు జెన్ ఫ్యాక్టరీలో ప్రాసెస్ అసోసియేట్ గా ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగమేల ఈనెల 25న దుబ్బ గుబ్బబాది రోడ్ లోని అక్షర్ధామ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు ఉద్యోగమేళాలు పాల్గొనడానికి అర్హులని ఎమ్మెల్యే ధనపాల్ వివరించారు ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించిన వారికి సంవత్సరానికి 2.3 నుంచి 2.4 లక్షల వరకు జీతం చెల్లిస్తారన్నారు ఉద్యోగానికి ఎంపికైన వారు హైదరాబాదులోని హఫీజ్పేట్ లో పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు సూచించారు

నిజామాబాద్ జిల్లా ట్రస్మా నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 తెలంగాణ రికార్డు నాయకుడు స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ తెలియజేశారు గురువారం చందూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యాలయంలో జరిగిన డిస్టిక్ జనరల్ మీటింగ్లో మామిడాల మోహన్ కాంతి గంగారెడ్డిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి నిర్వహించిన ఎన్నికలలో మాకూరు మండలం కు చెందిన రాస నిత్యానందమును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగేష్ తెలిపారు నందిపేట్ కు చెందిన అరుణ్ కుమార్ జనరల్ సెక్రటరీగా చందూర్ కు చెందిన ఉప్పాల మధును ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు నవీపేట్ గోపికృష్ణ ఆర్మూరు చైతన్య నిజామాబాదు నబి డిచ్పల్లి ప్రసాద్ రావు భీమ్గల్ నగేష్ వర్నిలను జాయింట్ సెక్రటరీలుగా వేణుగోపాల్ రాజు రెడ్డి కళ్యాణ్ హరీష్ చిరంజీవిలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర ఫోక్ పర్సన్ జయసింహ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్ సమస్యలపై పోరాటాలు చేయాలని అలాగే సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు నర్సింగ్ నరసింగరావు ధర్మరాజు రమణ రావు గోవర్ధన్ మరియు జిల్లాలోని అన్ని మండలాల ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు