23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

అంజనాద్రి ఆలయానికి గోమాత దానం

 నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై ఉన్న అంజనాద్రి ఆలయానికి పోతంగల్ గ్రామానికి చెందిన మనో చౌదరి కుటుంబీకులు గోమాతను బహుకరించారు దీంతో గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వారిని దంపతులను సన్మానించారు భక్తులు మల్లేశం మొగులయ్య విట్టల్ తదితరులు ఉన్నారు

మూడవ తేదీన పల్స్ పోలియో

 మార్చి మూడవ తేదీన చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల వైద్యాధికారి రోహిత్ అన్నారు నిజాంసాగర్ పిహెచ్సిలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని ఐదేళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేయాలని అన్నారు పోలియో చుక్కలు వేసేందుకు 40 కేంద్రాలను ఒక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు హెల్త్ సూపర్వైజర్లు మధు వెంకటనారాయణ సాయిలు పాల్గొన్నారు

22, ఫిబ్రవరి 2024, గురువారం

స్కూల్ బ్యాగుల వితరణ

 నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన 225 మంది విద్యార్థులకు బుధవారం శ్రీరామ సేవా సమితి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బ్యాగులు నీళ్ల సీసాలు పాఠశాలకు మూడు పంకాలు వితరణ చేశారు ట్రస్ట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ  సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు