21, ఫిబ్రవరి 2024, బుధవారం

గంగామాత ఆలయ వార్షికోత్సవాలు

 కామారెడ్డి పెద్ద చెరువు వద్దగల గంగమ్మ దేవాలయం 22వ వార్షికోత్సవాలు ఈనెల 23 24 25 తేదీలలో నిర్వహించనున్నట్లు పట్టణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గంగపుత్ర సంఘం ప్రతినిధులు జీ లక్ష్మీనారాయణ , పాకనారాయణ ,విజయ్ కుమారులు తెలిపారు .ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గం 2024

 భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా - కాసాల నరస గౌడ్

 ఉపాధ్యక్షులుగా - అంబల్ల సాయి నిఖిల్ ,తమ్మల సిద్ధరాములు 

ప్రధాన కార్యదర్శిగా -  మన్నె రాజశేఖర్

 సహాయ కార్యదర్శులుగా - బల్ల రాజశేఖర్, స్వామి

 కోశాధికారిగా - బలవంత రెడ్డి 

తదితరులు ఎన్నికయ్యారు

26 నుంచి బయో ఏషియా సదస్సు

 ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు జరగబోతున్నది. అంతర్జాతీయ సదస్సును రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ సహజంగానే ఉంటుందని ,అలాగే కర్ణాటక తెలంగాణ మధ్య కూడా పోటీ ఉన్నదన్నారు.