పర్యావరణ పరిరక్షణకు మానవ మనుగడకు ప్లాస్టిక్ రహితమే ప్రాణప్రదమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాసరాజేశ్వర్ వారి తల్లిదండ్రులు భాష పోశెట్టి లక్ష్మీబాయి స్మృతి అర్థం కాటన్ క్లాత్ తో రూపొందించిన హ్యాండ్ బ్యాగులను మంగళవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్ లో సీనియర్ న్యాయవాదులు మంథని రాజేందర్ రెడ్డి ఆకుల రమేష్ నీలకంఠరావు గొర్రెపాటి మాధవరావు శ్రీహరి ఆచార్య కుమార్దాస్ జై వెంకటేశ్వర్ వి భాస్కర్ మాణిక్ రాజ్ ఆశ నారాయణలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు తాగే నీటి నుండి మొదలు తినే ఆహారం వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి బట్టలతో తయారుచేసిన వాటిని ఉపయోగించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వస్తువులు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు మనుషులను చుట్టూ ముడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతకాలపు తరం బట్టలతో చేసిన వాటిని ఉపయోగించి ఆరోగ్యంగా జీవించారని వారే నీటి తరానికి ఆదర్శం కావాలని ఆమె అన్నారు ప్రతి పౌరుడు తన తల్లిదండ్రుల పేరున క్లాత్ తో తయారు చేసిన బ్యాగులను ఇతరత్రా చిన్న చిన్న బ్యాగులను ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కారకులు కావాలని ఆమె ఆకాంక్షించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఫిబ్రవరి 2024, బుధవారం
22న సెపక్ తక్ర జూనియర్ , సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు
భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం
మేడారం మహా జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర గిరిజనుల పండగ మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ ప్రసాదం బంగారు అందజేయాలని టిఎస్ఆర్టిసి అధికారులు నిర్ణయించారు గతంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలు బంగినపల్లి మామిడిపళ్ళు విజయవంతంగా మీ ఇంటి వద్దకే చేరవేశాము భక్తులకు మరింత దగ్గర అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పండగ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రసాదం బంగారంతో పాటు అమ్మవారి పసుపు కుంకుమను భక్తులకు టిఎస్ఆర్టిసి కార్గో వారు అందించనున్నారు ఈ సదవకాశం ఈనెల 25వ తేదీ వరకు భక్తులు నేరుగా లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద ప్రసాదం బుక్ చేసుకోవచ్చు ప్రసాదం బుక్ చేసుకునే భక్తులు నిజామాబాద్ రీజియన్ లోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద 2009 రూపాయలు చెల్లించి బుకింగ్ టికెట్ పొందాలి ఈ ప్రసాదం బంగారం బుక్ చేసుకున్న వారికి జాతర పూర్తి అయిన తర్వాత ఆర్టీసీ సిబ్బంది భక్తుల ఇంటి వద్దకే వచ్చి ప్రసాదాన్ని అందజేస్తారు ఈ ప్రసాదాన్ని అందించిన సమయంలో మీరు మా సిబ్బందికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించిన అవసరం లేదని డి శ్రీనివాస్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నిజామాబాద్ తెలిపారు మేడారం ప్రసాదం బంగారం బుకింగ్ కొరకు నిజామాబాద్ రీజియన్ డిపో నెంబర్లు ఆర్మూర్ 9550232626 9014296638 నిజామాబాద్ వన్ మురళి 9154298727 నిజామాబాద్ టు సాయికుమార్ 7396889496 బాన్స్వాడ ఇర్ఫాన్ 9154298729 కామారెడ్డి రాజు 9154298730 ఆర్ ఎం ఆఫీస్ నిజామాబాద్ ఆర్ఎం ఈ కాశిరాం 8639969647 9154298731 నెంబర్లకు మాట్లాడి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జాతరలో కు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ అందిస్తున్న సువర్ణ అవకాశాన్ని సద్వినియం చేసుకొని ప్రసాదం బుక్ చేసుకోవాలని డిప్యూటీ ఆర్ ఎం సరస్వతి తెలిపారు ఈ సేవలు ఈనెల 25వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు

