21, ఫిబ్రవరి 2024, బుధవారం

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

 సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ధర్మాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని గుడిమెట్ మహాదేవ మహారాజు అన్నారు మంగళవారం బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి స్థిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలన్నారు సనాతన హిందూ ధర్మం చాలా గొప్పదని అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు మూడు రోజులపాటు నిర్వహించే విగ్రహ స్థిర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహం ఊరేగింపు హోమం నిర్వహించారు అన్నదానం చేశారు మహిళలకు కుంకుమార్చనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



మైసమ్మ ఆలయంలో భక్తుల సందడి

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారంలో కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 దోమకొండలో మంగళవారం జరిగిన నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో స్థానిక జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో జెడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు గోసంకి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరే గోపాల్ రెడ్డి గోసంగి సంఘం బాధ్యులు తదితరులు ఉన్నారు