21, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆలయానికి విరాళం

 కామారెడ్డి విశ్వనాథేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దువ్వల సత్యనారాయణ 25 వేల ఒక వంద16 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి 6 7 8 తేదీలలో విశ్వనాథేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం ఉన్నట్లు కమిటీ భక్తులు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని విశ్వనాథేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి

గర్గుల్లో గుడి నిర్మాణం

 కామారెడ్డి మండలం గర్గుల్ ఎస్సీ కాలనీలోని లండ ఎల్లమ్మ గుడిని మూడున్నర లక్షల రూపాయలతో మాజీ సర్పంచ్ చింతల రవి తేజ గౌడ్ తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చాడు ఈ సందర్భంగా అంబేద్కర్ మాదిగ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ రాజా గౌడ్ పెద్దరాజా గౌడ్ సురేష్ గౌడ్త  తదితరులు పాల్గొన్నారు

23న జిల్లా స్థాయి అథెలిటిక్స్ ఎంపికలు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో ఈనెల 23న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జైపాల్ రెడ్డి అనిల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అండర్ 14 16 18 బాలబాలికల విభాగాలలో 400 మీటర్ల పరువు పందెం నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు త్వరలో హైదరాబాద్లో నిర్వహించే 400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్  పాల్గొంటారని తెలిపారు ఆసక్తి గల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవీకరణ పత్రంతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు