ప్రముఖ హైకోర్టు న్యాయవాది పెద్ద బచ్చ గారి రామిరెడ్డిని ఆదివారం వృద్ధుల సంఘం ప్రతినిధులు సన్మానించారు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో పలువురి దాతల సహకారంతో వృద్ధుల సంఘ భవన నిర్మాణం చేపట్టారు ఇందులో భాగంగా న్యాయవాది రాంరెడ్డి తనవంతుగా చేయూతని అందించారు ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు అనంతరం న్యాయవాది రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వృద్ధులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎడ్ల రాజిరెడ్డి నారాయణరెడ్డి మద్ది రాజిరెడ్డి జగ్గారెడ్డి బాల్రెడ్డి రామిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
19, ఫిబ్రవరి 2024, సోమవారం
ఉద్యోగమేళా ఉపాధికి బాట
ఉద్యోగమేళా ఉపాధికి బాట
నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రతినెల విస్తృతంగా జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతోంది 17వేల దరఖాస్తులు జిల్లాలో డిగ్రీ పీజీ చదువు పూర్తి చేసిన వారు ఎంతోమంది ఉన్నారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కష్టసాధ్యమైనందున ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం కల్పిస్తున్నారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం మంచి జీతభత్యాలు అందిస్తుండటంతో యువత ముందుకు వస్తోంది ఇప్పటివరకు ఉపాధి కల్పన కార్యాలయంలో 1753 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు జాబ్ మేళాలకు మంచి స్పందన రావడంతో రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో మేళాలు నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు
దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీనివాస్ అన్నారు నిరుద్యోగ యువత కోసం ప్రైవేట్ రంగంలో కొలువులు కల్పించడానికి చేపడుతున్న ఉద్యోగమేళాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నెల రెండు మేళాలు నిర్వహిస్తున్నాము యువత సమయం వృధా చేసుకోకుండా ముందుకు రావాలన్నారు
టైక్వాండో శిక్షణ స్వీయ రక్షణ
ప్రస్తుత సమాజంలో బాలికలు మహిళలపై అఘైత్యాలు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో తమని తాము రక్షించుకునేందుకు స్వీయ రక్షణ నైపుణ్యాలు అవసరం ఈ నేపథ్యంలో విద్యార్థులు మహిళలకు టైక్వాండో ద్వారా ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ఆమె ప్రోత్సాహంతో ఎంతోమంది థైక్వాండోలో మెలకువలు నేర్చుకుంటున్నారు
1200 మందికి
బాలికలకు మహిళలకు ఆత్మ రక్షణ క్రీడలో ప్రవేశం ఉండాలని ప్రత్యేక చొరవతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఇందుకోసం జిల్లా టైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు కాంచీపురం మనోజ్తో చర్చించారు ఆయా శాఖల అధికారులతో మాట్లాడిన అనంతరం దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ పాఠశాలలు ఇంటర్ డిగ్రీ కళాశాలలు విద్యార్థినులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించారు ఈ శిక్షణలో 1200 మంది విద్యార్థులు టైక్వాండో నేర్చుకుని సాధన చేస్తున్నారు పాఠశాల కళాశాలల పీఈటీలతో చర్చించి నిరంతర సాధన కొనసాగేలా చర్యలు తీసుకున్నారు శిక్షణ సమయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేకంగా తరగతిలో పరిశీలించారు నేర్చుకున్న విద్యను వారి స్నేహితులు బంధువులకు నేర్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు
నా కలల ప్రాజెక్టు
సునీత కుంచాల జిల్లా న్యాయమూర్తి
జిల్లాలోని ప్రతి ఆడపిల్ల తనను తాను రక్షించుకునేలా తయారు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది నా కలల ప్రాజెక్టు దీనిపై శిక్షకుడు చర్చలు జరపడంతో ఆయన ముందుకు వచ్చారు. విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించాం బాలికలు మహిళలు స్వేచ్ఛగా తమకు నచ్చిన రంగంలో రాణించేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది ఎవరైనా బాలికలు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ విద్య ఆయుధంగా ఉపయోగపడుతుంది శిక్షణ కాలం పూర్తయిన సాధన కొనసాగేలా చూస్తున్నాం
ప్రణాళికతో ముందుకు పోతున్నాం
మనోజ్ జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు
బాలికలకు తైక్వాండో శిక్షణ ఇప్పించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల నన్ను సంప్రదించారు ఇది ఎలా సాధ్యమవుతుందో చర్చించాము. ప్రణాళిక వేసుకుని ఆయా పాఠశాలలో కళాశాలల ప్రిన్సిపాల్లను సంప్రదించాను ఆ తర్వాత శిక్షణను ప్రారంభించాం తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునేలా శిక్షణ తరగతులు నిర్వహించాను అన్నారు