11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అయ్యప్ప ఆలయంలో వసంత పంచమి వేడుకలకు తీర్మానం

 ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఈనెల 14వ తేదీ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది శనివారం కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి రాజేంద్రనాథ్ ఆదాయవేయాలు చదివి వినిపించారు ఆలయ శాశ్వత కమిటీ సభ్యులు 18 వేల రూపాయలుగా నిర్ణయించి తీర్మానించారు అలాగే ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి 18 వేల కంటే ఎక్కువ శాతం చందాలు అందించిన ప్రతి సభ్యుడు శాశ్వత సభ్యులుగా పరిగణింపబడతారని తీర్మానించారు ఆలయం చుట్టూ బండల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామన్నారు ఆలయం వద్ద బాత్రూంలో నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ముదిగొండ చంద్రం ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోశాధికారి ఈశ్వర్ గౌడ్ సభ్యులు ప్రశాంత్ గౌడ్ ఓర భీమయ్య మురళి నాగం సాయిబాబా నవీన్ భూపాల్ పంతులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు



మల్టీ జనరేషన్ పార్క్ ఎంట్రీ ఫీజు పది రూపాయలు

 బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్టకింద నూతనంగా నిర్మించిన పిఎస్ఆర్ మల్టీ జనరేషన్ చిల్డ్రన్ పార్కులలో ఈ నెల 12 నుంచి ఎంట్రీ ఫీజు 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారుకు నిర్వహణ నిమిత్తం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పార్క్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు



మార్చి 3న జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు

 మార్చి మూడున నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దికొండ యాదగిరి అన్నారు శనివారం నగరంలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారుడిగా డాక్టర్ సత్యనారాయణ ను ఎన్నికల అధికారిగా నియమించినట్లు చెప్పారు అధ్యక్ష కార్యదర్శులతో పాటు 21 పదవులకు ఎన్నికలు జరుపుతామని అన్నారు ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ 17న స్కూటీని 18 నుంచి 19 వరకు ఉపసంహరణ ఉంటుందన్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్ పత్రాలను సమర్పించాలని అన్నారు జిల్లాలోని పద్మశాలి సంఘ సభ్యుడు తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు గురు చరణ్ గుడ్ల భూమేశ్వర్ దేవి దాస్ గంగా దాస్ తదితరులు పాల్గొన్నారు