8, ఫిబ్రవరి 2024, గురువారం

నూతన కార్యవర్గం ఎన్నిక

 చందూర్ మండల కేంద్రంలో బుధవారం 

చందూర్ మండల   బహుజన టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా -  యాకూబ్ అలీ అన్సారీ 

మండల ప్రధాన కార్యదర్శిగా -  మేడిపల్లి సాయిలు

 ఎన్నికయ్యారు ఈ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శి డి స్వామి నాయక్ ఆధ్వర్యంలో వీరిని నియమించడం జరిగింది.



మారుతీ మందిర దుకాణం వేలం పాట

 బోధన్ పట్టణంలోని మారుతి మందిర ప్రాంగణంలో గల నెంబర్ ఒకటి దుకాణాన్ని ఈనెల 14వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు ఆసక్తి గలవారు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు అభ్యర్థులు తమ పేర్లను మారుతి ఆలయం వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సంప్రదించాలని తెలిపారు



సచివాలయ ఉద్యోగుల సంఘం అడ్ హాక్ కమిటీ 2024

 తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కమిటీ 2024 ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కంచర్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వీరి కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని ఎన్నికలు జరగని పక్షంలో ఎన్నికలు నిర్వహించే వరకు వీరే కొనసాగుతారని పేర్కొన్నారు గత నెలలో టీఎస్ఎస్ఏకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ను నియమించి దాని భైలాస్ ప్రకారం ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి మద్దతుగా సచివాలయం అసెంబ్లీ ఉద్యోగులు సుమారుగా 700కు పైగా సంతకాల సేకరణ చేసి గత నెల 17వ తేదీన ఆ వినతి పత్రాన్ని చీఫ్ సెక్రటరీకి అందజేసినట్లు పేర్కొన్నారు కమిటీలో

 అధ్యక్షుడు - సురేష్ అండ్ 

ప్రధాన కార్యదర్శి - బి రాజేశ్వరి

 కోశాధికారి - వంశీధర్ రెడ్డి ధర్మ 

అదనపు కార్యదర్శి - సుజిత్ కుమార్

 సంయుక్త కార్యదర్శి - టి శివాజీ

 సంయుక్త కార్యదర్శి క్రీడలు - కే స్వామి

ఎంపికైనట్లు చెప్పారు.