4, ఫిబ్రవరి 2024, ఆదివారం

9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన

 హైదరాబాద్ బుక్ ఫెయిర్ అసోసియేషన్

తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాదులోని గంగా జమున తహసీబ్ సంస్కృతికి నిలువుటద్దంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిలిచిందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ అన్నారు ఫిబ్రవరి 9 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో జరిగే పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు ఈ పుస్తక ప్రదర్శనలో పంచుకోవాలని జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని అన్నారు సామాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలూరు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికి ఉందన్నారు భావితరాల్ని తీర్చిదిద్దే శక్తి తరగతి గదికి ఉందని మకిలి పట్టిన సమాజం బూజు దులిపే పనిముట్లుగా పుస్తకాలు ఉపయోగపడతాయని రచించిన విశ్వాసంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ దశాబ్ద కాలంగా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బుక్ ఫైర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి కోయ చంద్రమోహన్ కోశాధికారి పీ రాజేశ్వరరావు సహాయ కార్యదర్శి శోభన్ బాబు కార్యవర్గ సభ్యులు కవి యాకూబ్ జనార్ధన్ గుప్తా బాల్రెడ్డి శ్రీకాంత్ మాటూరు సూర్యనారాయణ పాల్గొన్నారు

కరడ్ పల్లి గ్రామ గుడాడి రెడ్డి సంఘం 2024

 కరడ్ పల్లి గ్రామ గుడాడి రెడ్డి సంఘం నూతన కార్యవర్గమును 2024 ఎన్నుకున్నట్లు సంఘ

 అధ్యక్షులు - ఏలేటి సూర్యకాంత్ రెడ్డి తెలిపారు

 ఇందులో కార్యదర్శిగా -  నల్లబెల్లి సుభాషిరెడ్డి

 కోశాధికారిగా - ఏలేటి రాజిరెడ్డిలు 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రెడ్డి సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం సంఘ సభ్యులను శాలువాలతో సన్మానించారు కార్యక్రమంలో రెడ్డి సంఘ సలహాదారులు సభ్యులు పాల్గొన్నారు.



ఏ టి యు సి బాన్స్వాడ డివిజన్ కార్యవర్గం 2024

 ఏ టి యు సి డివిజన్ నూతన కార్యవర్గాన్ని పట్టణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా దుబాస్ రాములు ప్రధాన కార్యదర్శిగా శంకర్ ఉపాధ్యక్షుడిగా ధర్మ చిన్నసైలు కార్యదర్శిగా సమృద్ధి శివాజీ పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు