3, ఫిబ్రవరి 2024, శనివారం

కేవైసీ మోసాలతో జాగ్రత్త ఆర్బిఐ హెచ్చరిక

 నో యువర్ కస్టమర్ కేవైసీ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది స్కామర్లు ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ తో బాధితుల వ్యక్తిగత సమాచారం ఖాతా వివరాల వంటివి చోరీ చేస్తున్నారు మోసగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్ పంపి కస్టమర్లు ఆందోళన పడేలా చేస్తారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఖాతా రద్దు అవుతుందని భయపెడతారు. దీంతో బాధితుడు భయపడి మొత్తం సమాచారం ఇస్తాడు ఫైనాన్షియల్ సైబర్ మోసాలు జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆర్పిఐ తెలిపింది కేవైసీ అప్డేషన్ కోసం ఏదైనా రిక్వెస్ట్ వస్తే నిర్ధారణ కోసం నేరుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలని పేర్కొంది ఆర్థిక సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఖాతా లాగిన్ వివరాలు వెరిఫై కానీ యాప్లను ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆర్బిఐ తెలిపింది



అమెజాన్ స్వచ్ఛత స్టోర్ ప్రారంభ

 ఢిల్లీలోని అమెజాన్ స్వచ్ఛత స్టోరును కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ప్రారంభించారు ఈ స్టోర్ ద్వారా లోకల్ సెల్లార్లు ఎస్ఎంఈలు తయారీదారులు నుంచే వ్యాక్యూమ్ క్లీనర్స్ శానిటరీ వేర్ వాటర్ ప్యూరిఫైయర్స్ మ్యాప్స్ చీపుండు వంటి వస్తువులు తక్కువ ధరలకే కొనొచ్చు ఇందులో 20 వేలకు పైగా వస్తువులుంటాయి అంతేగాక పరిశుభ్రత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా అవగాహన కలిగిస్తారు.



వాలీబాల్ టోర్నీ విజేత బోర్లామ్ క్యాంప్

 బాన్సువాడ ఉద్దెన గంగప్ప స్మారకార్థం ఇబ్రహీంపేటలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో బోర్లాం క్యాంప్ జట్టు విజేతగా నిలిచింది శుక్రవారం గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కళావతి మాట్లాడుతూ గంగప్ప సర్పంచ్ గా గ్రామానికి ఎంతో సేవ చేశారన్నారు కార్యక్రమంలో ఆనంద్ వినయ్ రాజ్ కుమార్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.