జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ తో రాజస్థాన్ పర్యాటకానికి గణనీయమైన మేలు జరగడమే కాకుండా నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ను ఆమె ప్రారంభించారు ముగ్గురు బుకర్ అయిదుగురు పులిజర్ విజేతలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుకకు వచ్చార.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు
ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం రూట్ లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడం పై ఉన్నతాధికారుల ఆగ్రహం
ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్ నడపడం వివాదాస్పదమైంది ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు కాలేజీ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈరోట్లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం ప్రతి ఉంటున్నది ఫుట్ బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు. ఈ రద్దీని తగ్గించేందుకు అధికారులు జెంట్స్ స్పెషల్ బస్సు నడిపారు అయితే దీనిపై మహిళలు అభ్యంతరం చెప్పడంతో ఒక్క ట్రిప్ నడిపిన తర్వాత బస్సును ఆపేశారు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను వివరణ కోరగా జెంట్స్ స్పెషల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు అలాంటి బస్సులు నడపాలని ఆదేశాలు ఇవి లేవన్నారు అనుమతి తీసుకోకుండానే బస్సు ఎలా నడుపుతారని డిపో మేనేజర్ పై ఆ గ్రహం వ్యక్తం చేశారు దీంతో అది పాత ఫోటో అని జెంట్స్ స్పెషల్ బస్సు నడపలేదని డిపో అధికారులు మాట మార్చారు హైదరాబాదులో మహిళలు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని రూట్లలో ఇప్పటికే లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు వీటి సంఖ్య పెంచాలని ప్రపోజల్ వస్తున్న బస్సుల కొరత కారణంగా ఆర్టీసీ పెంచడం లేదు త్వరలో కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో వీటి సంఖ్య పెంచాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది
స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యకు డాక్టరేట్
సామాజిక సేవతోపాటు సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ సంస్థ దివ్యాంగుల కోసం స్కూల్ ఏర్పాటు చేసి సామాజిక సేవలు అందిస్తున్న స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యకు డాక్టరేట్ లభించింది సిద్దయ్య సేవలను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది 1992లో ఏర్పడిన స్నేహ సొసైటీలో సిద్దయ్య 3ఏళ్లుగా సేవలందిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సిద్దయ్య పేర్కొన్నారు.


