13, మార్చి 2024, బుధవారం

టి సేఫ్ యాప్ కాదు సేవ

 బేసిక్ ఫోన్ లోను సేవలు లభ్యం యాప్ ప్రారంభంలో సీఎం రేవంత్ వెల్లడి రాష్ట్ర పోలీసుల కృషికి అభినందన

తెలంగాణ పోలీసుల రూపొందించిన టిసి యాప్ మాత్రమే కాదని అది సేవా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్స్ సేఫ్ పేరిట తెలంగాణ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవల్ని సచివాలయంలో సీఎం మంగళవారం ఆవిష్కరించారు ఈ సేవలను పొందేందుకు స్మార్ట్ఫోన్ ఉండాల్సిన అవసరం లేదని యాప్ డౌన్లోడ్ చేయాల్సిన పనిలేదని తెలిపారు మహిళల చేతిలో బేసిక్ ఫోన్ ఉన్న టి సేఫ్ సేవలను పొందే వీలుందని పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పోలీసులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి విధానాన్ని ప్రకటించిన రోజే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బిజెపి రఘుతా హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ షికా గోవిల్ తదితరులు పాల్గొన్నారు

ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్ కు ఫోన్ చేసిన అనంతరం ఐవిఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ను ఎంపిక చేసుకుని టి సేఫ్ సేవలను పొందవచ్చు అలాగే ఫోన్ చేసిన వెంటనే ఆటోమేటెడ్ లింక్ వస్తుంది దీని ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో లేదా టి సేఫ్ పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్స్ అప్లికేషన్ ద్వారా సేవను పొందవచ్చు

రాష్ట్రంలోని 791 పెట్రోలింగ్ కారులు 1000 85 బ్లూ కోల్డ్స్ వాహనాలను ఈ యాప్ తో అనుసంధానం చేయనున్నారు వినియోగదారులు తమ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులతోనూ లైవ్ లొకేషన్ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు

మజ్జిగ వితరణ

 బాన్సువాడ పట్టణంలోని రామ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో 500 మంది ప్రయాణికులు పేదలకు మంగళవారం మజ్జిగ పంపిణీ చేశారు సభ్యులు మాట్లాడుతూ దాతర సహకారంతో 50 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు సంస్థ అధ్యక్షుడు నాగరాజు ఉన్నారు

అత్యుత్తమ పర్యాటక నగరాలలో హైదరాబాద్ ఒకటి

 లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలోనే అత్యుత్తమ పర్యాటక నగరాలలో హైదరాబాద్ ఒకటి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు మంగళవారం నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్కులు కేంద్ర పర్యటకశాఖ సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంట్ స్కీమ్లో భాగంగా 50 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అన్నారు ప్రస్తుతమున్న కోహినూరు వజ్రపు కథస్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకోవాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు కోహినూర్ కథను రాజ్యసభ సభ్యుడు సినీ రచయిత విజయేంద్రప్రసాద్ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా సింగర్ సునీత గాత్రం వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు ఇక్కడే నిర్మించిన మల్టీపర్పస్ బాంకెట్ హాల్ను మంత్రులు ప్రారంభించార