29, ఫిబ్రవరి 2024, గురువారం

కృత్రిమ జిహ్వ సృష్టించిన సైంటిస్టులు

 ఆర్టిఫిషియల్ టంగ్ సృష్టించిన సైంటిస్టులు సెన్సార్ల సహాయంతో నోటి క్రిములకు చెక్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాలలో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లతోనే జరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి దీనితో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి మరికా పరిశోధకులు నడుము కట్టారు ఈ క్రమంలోని నోటిలోని బ్యాక్టీరియా ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతోపాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ కృత్రిమ నాలుకను తాజాగా అభివృద్ధి చేశారు కొత్త రుచులను గుర్తించడంతోపాటు ఓరల్ ఇన్ఫెక్షన్లను డెంటల్ డిసీజెస్ను క్యాపిటల్ కలుగజేసే పదకొండు రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాలలో గుర్తించడంతోపాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్ళు తెలిపారు సెన్సార్ల సాయంతో పని సెన్సార్ల సహాయంతో పని చేసే ఈ ఆర్టిఫిషియల్ టంగును లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ప్రోగ్రామ్స్ తో కూడిన డిఎన్ఏ ఎన్కోడెడ్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ తో ఈ సెన్సార్లను తయారు చేసినట్లు వెల్లడించారు ఈ కృత్రిమ నాలుకతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని వెల్లడించారు ఈ వివరాలు ఏసిఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ ఫేసెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి

శ్వేత ప్రసాద్కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారము

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారుని శ్వేతా ప్రసాద్ 2022 23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారకు ఎంపికయ్యారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది సంగీత విభాగం కర్ణాటక మ్యూజిక్ లో తెలంగాణ నుంచి శ్వేతా ప్రసాదం ఎంపిక చేశారు శ్వేతా ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా 2 వేలకు పైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు అన్నమాచార్య కృతులు త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు దేశ విదేశాలలో భరతనాట్యము ఆంధ్ర నాట్యము కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రము నట్టువాంగా సహకారం అందించారు పలు నృత్య ప్రదర్శనలకు స్వర కల్పన చేశారు అమెరికా చైనా మలేషియా టర్కీ సిరియా వియత్నాం దేశాలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవారాలైన శ్వేతా ప్రసాద్ నాలుగేళ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు కర్ణాటక ఓకల్ , లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుని ఆయన శ్వేతా ప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీ చేస్తున్నారు

గంగాధరశాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు

 ప్రసిద్ధ గాయకుడు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్వి గంగాధరశాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది 2023 ఏడాదికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరిచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం గంగాధర శాస్త్రి యథాతకంగా పాడారు అంతేకాదు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా గానం చేశారు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాడిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి అవార్డును ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గంగాధర శాస్త్రి పేర్కొన్నారు అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యాపురేచతో పాటు జూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు