24, ఫిబ్రవరి 2024, శనివారం

లిక్విడ్ యు వి స్క్రీన్ ప్రొటెక్టర్స్ వద్దు


స్మార్ట్ ఫోన్లు కు లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లను వాడవద్దని ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షా వోమి వినియోగ దారులకు సూచించింది. వాటిలో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు చార్జింగ్ పోర్టు స్పీకర్ ఇతర భాగాల్లోకి వెళ్లి ఫోన్ పనితీరును  దెబ్బ తీస్తుంది అని తెలిపారు.దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదు అని తెలిపారు.ఈ మేరకు కంపెనీ తాజా గా వినియోగ దారులకు ఒక అడ్వైజరీ విడుదల చేసింది.లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లు కాకుండా టెంపర్డ్ , నాన్ టెంపర్డ్ గ్లాస్ ఎలక్ట్రో స్టాటిక్ ఫిల్మ్స్ ను వాడవచ్చని స్మార్ట్ ఫోన్లు పనితీరుకు వాటి లైఫ్ టైమ్ కు సురక్షితమని పేర్కొంది.

బుల్లి వాషింగ్ మెషిన్ భళా

 ఏపీకి చెందిన సాయి తిరుమల అనే కుర్రవాడు ప్రపంచంలో ని అతి చిన్న వాషింగ్ మిషన్ తయారుచేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు గిన్నిస్ బుక్ లోను స్థానం సంపాదించాడు ఇతడి అసాధారణ ప్రయత్నాన్ని కిన్నిస్ బుక్ బుధవారం తన ఇంస్టాగ్రామ్ పేజీలో ప్రదర్శించింది ఈ యంత్రం పనితీరుపై పలువురు ఆసక్తి కనబరిచారు 37 మిల్లీమీటర్లు ఇంటూ 41 మిల్లీమీటర్లు ఇంటు 43 మిల్లీ కొలతలతో సాయి ఈ యంత్రాన్ని రూపొందించాడు అని గిన్నిస్ బుక్ పేర్కొన్నది

ఇక రైళ్ల లోనూ స్విగ్గి సేవలు

 ఇక రైళ్లలోనూ స్విగ్గి సేవలు తొలి దశలో నాలుగు స్టేషన్లో అమలు దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న స్వీకీ ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించండి ఐఆర్సిటిసి ఈ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీ ఆర్డర్ మీల్స్ ను ముందస్తుగా ఆర్డర్ చేసిన ఆహారం అందించనున్నది. ఈ మేరకు భారత రైల్వే తో స్విగ్గి జట్టు కడుతోంది స్విగ్గి ఫుడ్స్ తో కలిసి ఈ క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఐఆర్సిటిసి తాజాగా స్టాక్ చేంజ్ వద్ద ఫైలింగ్ లో పేర్కొన్నది రైలు ప్రయాణికులకు స్విగ్గి ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదటి దశలో భాగంగా విజయవాడ విశాఖపట్నం బెంగళూరు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సిటిసి ఒక ప్రకటనలో తెలిపింది