22, ఫిబ్రవరి 2024, గురువారం

మేడారం జాతరలో సరదాగా చూడడానికి ఏమేమి ఉన్నాయి

 అమ్మవార్ల దర్శనం అనంతరం జాతరలో సరదాగా చూడడానికి దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఇవి

రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చిత్రాలు వినియోగించిన వస్తువులు చూడొచ్చు సమ్మక్క జీవిత చరిత్రను బొమ్మల్లో తీర్చిదిద్దారు

గిరిజన మ్యూజియం ఆవరణలో ఆంఫి థియేటర్ ఉంది ఆదివాసీ నృత్యాలు నాటకాలు ప్రదర్శిస్తారు అనేక రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి

హరిత హోటల్లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉంటాయి ఇక్కడ వసతి కోసం 24 ఉగాదులు 25 ఆధునిక టెంట్లు ఉన్నాయి ప్రముఖుల బాస కోసం స్విస్ కాటేజీలు గుజరాత్ దర్బార్ గుడారాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి

మేడారం పరిసరాల్లోని సమ్మక్క గుడి గురించి చాలామందికి తెలియదు గద్దెలకు కాస్త దూరంలో పూజారుల నివాసాల మధ్య ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

సమ్మక్క ను చిలకలగుట్ట పైనుంచి గద్దెలకు తీసుకొస్తారు. ఈ గుట్ట ప్రకృతి రమణీయంగా ఉంటుంది సమీపంలో సమ్మక్క జలపాతం ఉంటుంది గుట్ట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి..

 అమ్మవార్ల గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం కొలువైంది పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో అలరాడుతుంది.

పిల్లల్లో చిప్స్ తినే అలవాటు ఎలా మానిపించాలి

 ఇంట్లో పెట్టే ఆహారం అసలు తినకుండా రోజు చిప్స్ తినే పిల్లలు ఆ అలవాటును ఎలా మానిపించాలి. వీటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా

పిల్లలు అన్నాక చిప్స్ తింటూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు అదే తరచూ తినడం వల్ల అవి వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి చిప్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి బంగాళదుంప అరటి వంటి వాటితో చేసేవి మరొకటి పిండితో బండి ఇవన్నీ నూనెలో ఎక్కువగా వేయిస్తారు. ఇంట్లో చేసినవి అయితే కాస్త పరవాలేదు అదే బయట దొరికే స్నాక్స్ లో రకరకాల మసాలాలు కారప్పొడిలు ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి తయారుచేస్తారు నోటికి రుచిగా కరకరలాడుతూ ఎక్కువ సేపు నమిలే శ్రమలేకుండా ఉన్నాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు పిల్లలు ఈ రోజుకి అలవాటు పడటం వల్ల నాలుక వాటిని ఎక్కువగా కోరుకుంటుంది అది తింటే చాలు వాళ్ళ పొట్ట నిండిపోతుంది కాబట్టి వేరే ఆహారం తినాలనిపించదు. చిప్స్లో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు ఖనిజాలు వీటి ద్వారా అందవు దాని కారణంగా ఐరన్ జింక్ విటమిన్ ఏ సి లోపాలు తలెత్తుతాయి అంతే కాదు త్వరగా అలసిపోవడం ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం చివరకు కంటిచూపులు కోల్పోయే పరిస్థితి కూడా పిల్లలు రావచ్చు కాబట్టి నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలి. అలా అని వెంటనే చిప్స్ తినొద్దు అంటే వినరు వారం పది రోజులకు ఓసారి ఇస్తూ వాటిని తింటే వచ్చే దుష్ఫలితాల గురించి చెప్పాలి భోజనంలో నూనె పప్పు గింజలు తృణధాన్యాలతో పాటు కూరగాయలు ఆకుకూరలు అన్ని రంగుల పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటయితే క్రమేడా వాళ్లే చిప్స్ అడగడం మానేస్తారు

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్యకు ప్రత్యేక రైలు

 అయోధ్య రామాలయ సందర్శనకు బుధవారం కామారెడ్డి నుంచి భక్తులు ప్రత్యేక రైలులో బయలుదేరి వెళ్లారు రైలు బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భక్తుల కోసం రైలు ఏర్పాటు చేశారని అన్నారు ఈ రైలు 1 345 మంది భక్తులతో కామారెడ్డి నుంచి బయలుదేరిందని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు భక్తులు దర్శనం పూర్తి చేసుకుని ఈ నెల 26 వరకు కామారెడ్డికి చేరుకుంటారన్నారు కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆలయ భాస్కర్ పైడి ఎల్లారెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామ్ రడ్డి తేలు శ్రీనివాస్ బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ పాల్గొన్నారు.