21, ఫిబ్రవరి 2024, బుధవారం

26 నుంచి బయో ఏషియా సదస్సు

 ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు జరగబోతున్నది. అంతర్జాతీయ సదస్సును రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ సహజంగానే ఉంటుందని ,అలాగే కర్ణాటక తెలంగాణ మధ్య కూడా పోటీ ఉన్నదన్నారు.

ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్

 గూగుల్ ప్లే స్టోర్ కు పోటీగా పరిచయం

కేసీఆర్ వినియోగదారుల కోసం బుధవారం ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ మొబైల్ యాప్ స్టోర్ ను పరిచయం చేసింది ఫోన్ పే

గూగుల్ ప్లే స్టోర్ కు పోటీగా వచ్చిన ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోరీ ఇండస్ యాప్ స్టోర్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెటుగా భారత్ ఉన్నది .ఈ క్రమంలోనే పెరుగుతున్న మొబైల్ వినియోగాన్ని అందిపుచ్చుకొని సంస్థగతంగా మరింత వృత్తి చెందాలని ఆలోచనతో ఇండస్ యాప్ స్టోర్ ఫోన్ పే తెచ్చింది. దీన్ని భారతీయ డిజిటల్ ప్రయాణంలో ఒక గొప్ప మార్పుగా ఫోన్ పే అభివర్ణిస్తుంది .ఈ కొత్త యాప్ వినియోగదారులు సమర్థవంతంగా వాడుకునేలా ఓ షార్ట్ వీడియోలు సైతం ఫోన్ పే ఈ యాప్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం .మరోవైపు ఈ యాప్ స్టోర్ వినియోగాన్ని పెంచేలా ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలతోనూ భాగస్వామ్యానికి ఫోన్పే ప్రయత్నిస్తున్నది. ఇక ప్రత్యేకంగా భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా తెలిపారు.

 ఇండస్ యాప్ స్టోర్ లో 45 విభాగాలు రెండు లక్షలకు పైగా మొబైల్ యాప్లు, గేమ్లు

 12 భారతీయ భాషల్లో సులభంగా గుర్తించేలా సౌలభ్యం

 డెవలపర్లు నమోదు చేసే తమ యాప్ లకు చార్జీలను చెల్లించిన అక్కర్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి దాకా ఇది వర్తిస్తుంది. 

వీలుకు తగినట్లు ఏ థర్డ్ పార్టీ పేమెంట్ గేటు వేనైనా డెవలపర్లు వాడుకోవచ్చు.

పోషకాహారం నిరుపేదలకు భారమే

 తక్కువ ఆర్థిక వనరులతో పోషకాహార లోపం జార్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి

పేద, మధ్యతరగతి వర్గాలకు పోషకాహారం అత్యంత భారంగా మారుతున్నది .తక్కువ ఆదాయం కలిగిన దేశాలతో పాటు మనదేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువమంది పేద ,మధ్యతరగతి వర్గాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రముఖ పరిశోధన సంస్థ జార్జి ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెళ్లడైంది .మొత్తం 26 అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత ఇరవై రకాల న్యూట్రిషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు .ఆహార ఆధారిత న్యూట్రిషనల్ సప్లిమెంట్లు గర్భిణుల పోషకాహారం, చిన్నారుల పోషకాహారం వంటి సమస్యలపై పరిశోధనల్లో గుర్తించారు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ వినియోగాన్ని పెంచడంలో అంతర్జాతీయంగా ప్రత్యేక విధివిధానాలు అవసరం ఉన్నాయని ముఖ్యంగా ,ఎన్సిడి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందేనని అధ్యయనం తేల్చింది.