21, ఫిబ్రవరి 2024, బుధవారం

తెలంగాణ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ 2024

 తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వైద్యాధికారుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం హైదరాబాద్లోని వెంగళరావు నగర్ లో జిల్లా వైద్యాధికారుల నూతన సంఘం ఆవిష్కృతమైంది వైద్య ఆరోగ్య ప్రమాణాల మేరకు తెలంగాణను దేశంలోని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో నూతన జిల్లా వైద్యాధికారుల సంఘం ఏర్పాటయింది ఈ మేరకు జరిగిన ఎన్నికల్లో

అధ్యక్షులు - డాక్టర్ పుట్ల శ్రీనివాస్

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - డాక్టర్ మల్లికార్జున్

 కోశాధికారిగా - డాక్టర్ పరిపూర్ణాచారి

 సలహాదారులుగా - డాక్టర్ కొండలరావు 

ఉపాధ్యక్షులుగా - డాక్టర్ బల్వన్, డాక్టర్ కోటాచలం, డాక్టర్ శ్రీదేవి

 ఇతర హోదాలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ సాంబశివరావు డాక్టర్ కృష్ణ డాక్టర్ శ్రీధర్ నియమితులయ్యారు

మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి ప్రతిష్టాపన

 దోమకొండలోని శ్రీ నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవంలో మంగళవారం దోమకొండ జడ్పిటిసి అభివృద్ధి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం అగ్ని ముఖం అగ్ని ప్రతిష్టాపన సర్వదేవత పూజలు హోమములు నూతన విగ్రహాలకు జలాధివాసం శిరాధివాసం దాన్యాధివాసము చతుర్వేద స్వస్తి పూజలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాలలో జడ్పిటిసి తో పాటు కాంగ్రెస్ నాయకులు కోసంగి సంఘం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మశంకర్ మాజీ ఎంపీటీసీ నల్లపూ శ్రీనివాస్ దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సీనియర్ నాయకులు కదిరి గోపాల్ రెడ్డి గోసంక సంఘం నాయకులు నూనె పుల్లయ్య మిర్యాల పోశెట్టి నూనె రాజేశం సింగం నూనె రాజేందర్ లక్ష్మీపతి స్వామి తదితరులు పాల్గొన్నారు

శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నదాతలుగా కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన కెరడ ప్రవీణ్ అర్చన దంపతులు ముందుకు రావడం జరిగింది అన్నదానానికి ముందుకు వచ్చిన అన్నదాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో 20050కి పైగా భక్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కలికి ఆలయ సేవా సమితి సభ్యులు ఎర్రం చంద్రశేఖర్ కొమిరిశెట్టి దిగంబర్ డాక్టర్ బాలు విజయ్ నరేందర్ రెడ్డి, సిద్ధంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు