17, ఫిబ్రవరి 2024, శనివారం

ట్రావెల్ ఎక్స్ పో 2024 లక్డి విజేతల ప్రకటన

 ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 45 రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ట్రావెల్ ఎక్స్ పో 2024 అనూహ్యస్ స్పందన లభించింది ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పక్కనే ఉన్న హోటల్లో శుక్రవారం లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళ భరణి చేతుల మీదుగా పదిమంది లక్కీ డిప్ విజేతలను ప్రకటించారు మొదటి ఐదుగురు విజేతలకు యువరాప్ దుబాయ్ చార్ధామ్ సిమ్లా మనాలి కాశ్మీర్ ట్రిప్ ని ఉచితంగా అందించారు మొదటి విజేతగా ఎండ్ రఘునాథరావు రెండవ విజేత సివిఎస్ సాయినాథ్ మూడవ విజేత మూర్తి రెడ్డి శేఖర్ రెడ్డి నాలుగవ విజేత నీలి అశోక్ కుమార్ ఐదవ విజేతగా సిహెచ్ లక్ష్మీదేవిని ప్రకటించారు అలాగే తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించిన ప్యాకేజీ విజ ేతలుగా గుజ్జ గంగారావు కే శశిరేఖ వెంపటి రాధాకృష్ణ ఎన్ నరసింహులు ఉల్లి విజయ్ కుమార్ లను ప్రకటించారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మీడియా ప్రతినిధులకు ఆర్వి సంస్థ అధినేత ఆర్వి రమణ కృతజ్ఞతలు తెలిపారు



ఎన్నారై పెళ్లిళ్లకు కొత్త చట్టం

 విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు ఎన్నారై లతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతుండడంపై లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వివాహిత మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ తరహా వ్యవహారాల కట్టడికి పకడ్బందీ నిబంధనలతో సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు రూపొందించిన నివేదికను లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రిటైర్డ్ రీతురాజ్ అవస్తి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘాలకు అందజేశారు ఇవి ప్రధాన సిఫారసులు

ఎన్నారై ఓసిఐ లతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో నమోదు చేయడానికి తప్పనిసరి చేయాలి కొత్త చట్టంలో విడాకులు భాగస్వామికి భరణం పిల్లల సంరక్షణ వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలి చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు వారెంట్లు జారీ చేయడం న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. 1967 పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి వైవాహిక స్థితి మేటర్ స్టేటస్ ని బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాముల రెండు పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా నిబంధనలు తీసుకురావాలి జీవిత భాగస్వాముల ఇద్దరి పాస్పోర్ట్లపై వివాహ నమోదు సంఖ్య ఉండేలా చూడాలి వివాహ నమోదు సంఖ్య ఎన్నారైల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతోపాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుంది దంపతుల రికార్డులు హోం శాఖ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలి ఇదే వివరాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉండాలి



ఆధ్యాత్మిక సమాచారం ఫిబ్రవరి 17 2024

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం సుప్రభాత సేవ గణపతి హోమం క్షీరాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పట్నం రమేష్ ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్ అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షుడు శ్రీను ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్ శ్రీను పిప్పిరి శ్రీను మోతుకూరి శ్రీను వీరమల్లి శ్రీను శ్రీధర్ తదితరులు ఉన్నారు

తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు ఉదయం పూజా కార్యక్రమాలు జరిపారు అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు రాంబాబు మేనేజర్ విటల్ అర్చకుడు నందకిషోర్ ఉన్నారు

శ్రీవారి ఆలయానికి విరాళం తెలంగాణ తిరుమల ఆలయానికి శుక్రవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు ఒడిశా రాష్ట్రం బరగడ గ్రామానికి చెందిన దాసరి శ్యామ్ హైదరాబాద్ కొంపల్లికి చెందిన రాజు ఒక్కొక్కరు 25వేల రూపాయలు చొప్పున మొత్తం 50,000 విరాళం ఇచ్చారు దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు మురళి వీరయ్య ఉన్నారు

నాగిరెడ్డిపేటలో బంజారా తండా గ్రామంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం గణపతి కలశపూజ యజ్ఞం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు సాయి ప్రకాష్ శర్మ కృష్ణ శర్మ రూప్ గ్ భక్తులు పాల్గొన్నారు

నసురుల్లాబాద్ మండలం సైన్యంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో శుక్రవారం శాస్త్రవేత్త పైడిల్లారెడ్డి తో పాటు స్థానిక భాజపా నాయకులు భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు

భక్తి మార్గాన్ని ఆచరించాలి అని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో భక్తి మార్గంలో ప్రయాణించాలని సద్గురు చంద్రశేఖర్ మహారాజ్ తెగులుర్ పేర్కొన్నారు చిన్న కొడంగల్ రామలింగేశ్వరాలయంలో నవనాథ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం ఏకాదశ రుద్రాభిషేకం గోపాలకాల కీర్తన నిర్వహించారు కాలకీర్తనకు ఆయన హాజరై భక్తులను ద్వేషించే ప్రసంగించారు తొలుత భక్తులు కలశాలు నిండు బిందెలు తులసి చెట్టును తలపై పెట్టుకుని భజనలతో ఊరేగింపు చేపట్టారు భక్తులు స్వామివారి దర్శనం పొందారు. అనంతరం మంగళహారతులు అందుకొని తీర్థ ప్సాదం అన్న ప్రసాదం స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు