9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు సహాయం

 రోటరీ క్లబ్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్ సంయుక్త ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సహాయార్థం నాలుగు చక్రాల బండిని ఉచితంగా అందజేయడం జరిగినదని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక బర్కత్పురా నందుగల రోటరీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 2026 27నకు గవర్నర్గా ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ పిల్లని హాజరవటం జరిగినదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ చిరు వ్యాపారుల సహాయార్థం తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బుల సహకారంతో చిరు వ్యాపారం చేసే వారికి నాలుగు చక్రాల బండిని ఉచితంగా అందజేయడం జరిగినదని అన్నారు ఇకముందు ప్రభుత్వ పాఠశాలలో బాలికల కొరకు షౌచాలయాలను నిర్మించుకుంటకు ధ్యేయంగా పెట్టుకున్నామని అన్నారు కార్యక్రమంలో గౌరవ అతిథిగా జితేంద్రమాలాని పి డి జ హనుమంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి బాబురావు వి ప్రకాష్ మిట్టల్ బిజిగామ అశోక్ హరిప్రసాద్ రాజకుమార్ సుబేదార్ జ్ఞాన ప్రకాష్ పార్సి రాజేశ్వర్ శ్యామ్ అగర్వాల్ గోపాల్ సోని సతీష్ షా శ్రీరామ్ సోనీ జుగల్ సోనీ శ్రీకాంత్ జవహర్ అంకిత్ సోనీ గోవిందు జవహర్ పాల్గొన్నారు

ప్రభుత్వ కళాశాలలో షార్ట్ టైం కోర్సులకు ప్రవేశాలు

 భీమ్గల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సార్ టైం కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అబ్బా చిరంజీవి మీడియా ద్వారా మాట్లాడుతూ షార్ట్ టైం కోర్సులకు విద్యార్థులు తీసుకురావాల్సిన నమూనా పత్రాలు ఫీజు చెల్లింపు 20 మార్చి 2024 లోపు ప్రవేశాలు పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు వివరాలు కు కళాశాల అధ్యాపకుడు రామ్ చందర్ 7 9 8 9 33 6 0 0 7 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గం 2024

 ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్లోని 

మహాలక్ష్మి కాలనీ నూతన కార్యవర్గాన్ని 2024 గురువారం ఎన్నుకున్నారు

 మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా -  బాలయ్య రావు గణేష్

 ఉపాధ్యక్షుడిగా - ఇందూరు విజయకుమార్

 కార్యదర్శిగా - గుడ్ల శ్రీనివాస్ 

సంయుక్త కార్యదర్శిగా - కర్త నవీన్ 

కోశాధికారిక - తాటికొండ కిషన్లను 

ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఐదవ వార్డు కౌన్సిలర్ బండారి ప్రసాద్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ పాలెపు రాజును కమిటీ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సాయిరాం దయాకర్ కాలనీవాసులు పాల్గొన్నారు