9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

రేపు రాష్ట్రస్థాయి ఉర్దూ సాహితీ సమ్మేళనం

 దోమకొండ మండల కేంద్రంలోని గడి కూటలో శనివారం రాష్ట్రస్థాయి ఉర్దూ సాహితీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గడికోట సీనియర్ మేనేజర్ బాబ్జి తెలిపారు ఉదయం 10:30 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుందన్నారు చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పెషల్ గెస్ట్ గా ఎస్పీ సింధు శర్మ ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు

నేటి నుంచి పుస్తక మహోత్సవం

 పుస్తకప్రియలకు పండగే పండగ 200కు పైగా ఇంగ్లీషు 110 కి పైగా తెలుగు 30కి పైగా హిందీ తదితర భాషలతో 360కు పైగా స్టాళ్లతో కూడిన హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభం కానుంది పది రోజులపాటు అంటే 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు శని ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు మిగతా రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు ఈ మేరకు బుక్ ఫైర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ వెల్లడించారు ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుతీరిన గద్దర్ స్మారక పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు అమరవీరుల స్మారకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న 12 అడుగుల స్థూపాన్ని తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు ఫిబ్రవరి 10 18 వరకు రోజు మధ్యాహ్నం బాలవికాస్ పేరుతో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ వివరించారు వారం పాటు రోజు సాయంత్రం సాహిత్య చర్చ పోస్టులు రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉన్నట్లు తెలిపారు

భారత్ పప్పు కిలో 60 రూపాయలు

 మిర్యాలగూడ కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట కిలో శనగపప్పును 60 రూపాయలకే ప్రజలకు అందిస్తోంది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విక్రయాలు ప్రారంభమయ్యాయి మూడు నెలల క్రితమే భారత్ శనగపప్పు కేజీ ప్యాకెట్లను ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టారు అమెజాన్ రిలయన్స్ సంస్థల్లో భారత్ జనాధాళ్ ను 60 రూపాయలకు కేంద్రం విక్రయిస్తోంది బహిరంగ మార్కెట్లో దాని విలువ 75 నుంచి 80 రూపాయలుగా ఉంది ఈ క్రమంలో మిర్యాలగూడలో ప్రధాన వీధుల్లో ఆటోలు ప్రధాన వీధుల్లో భారత్ పప్పు విక్రయాలు ప్రారంభమయ్యాయి ఆన్లైన్ విక్రయాల గురించి తెలియని వారు ఆటోల వద్ద పాపం కొనుగోలు చేస్తున్నారు ఇటీవల కేజీ 29 రూపాయలకే భారత్ రైస్ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసింది హాకా ద్వారా డీలర్లు వీటిని కొనుగోలు చేసి విక్రయించుకునే అవకాశం ఉంది