8, ఫిబ్రవరి 2024, గురువారం

సచివాలయ ఉద్యోగుల సంఘం అడ్ హాక్ కమిటీ 2024

 తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కమిటీ 2024 ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కంచర్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వీరి కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని ఎన్నికలు జరగని పక్షంలో ఎన్నికలు నిర్వహించే వరకు వీరే కొనసాగుతారని పేర్కొన్నారు గత నెలలో టీఎస్ఎస్ఏకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ను నియమించి దాని భైలాస్ ప్రకారం ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి మద్దతుగా సచివాలయం అసెంబ్లీ ఉద్యోగులు సుమారుగా 700కు పైగా సంతకాల సేకరణ చేసి గత నెల 17వ తేదీన ఆ వినతి పత్రాన్ని చీఫ్ సెక్రటరీకి అందజేసినట్లు పేర్కొన్నారు కమిటీలో

 అధ్యక్షుడు - సురేష్ అండ్ 

ప్రధాన కార్యదర్శి - బి రాజేశ్వరి

 కోశాధికారి - వంశీధర్ రెడ్డి ధర్మ 

అదనపు కార్యదర్శి - సుజిత్ కుమార్

 సంయుక్త కార్యదర్శి - టి శివాజీ

 సంయుక్త కార్యదర్శి క్రీడలు - కే స్వామి

ఎంపికైనట్లు చెప్పారు.






ఈ లూనా వచ్చేసింది

 


నయా ఈలునా సింగిల్ చార్జింగ్తో 110 కిలోమీటర్ల మైలేజీ విడుదల చేసిన కైనెటిక్ గ్రీన్ ధర 69,990 రూపాయలు

అప్పుడెప్పుడో 30 40 ఏళ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా మళ్ళీ కొత్త రూపులో ముందుకొచ్చింది ఈ లునా పేరుతో దీన్ని దేశీయ మార్కెట్కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది ఈ విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ విచిత్ర వాహనం రైతులు చిరు వ్యాపారుల వినియోగానికి అస్త ఉత్పత్తుల డెలివరీలకు వీలుగా ఉన్నది వెనుక సీటును వేరు చేసుకునే సదుపాయం ఉన్న ఈ టూ వీలర్ పై సిలిండర్లు పెట్టెలు ఇతరత్రా సామాగ్రిని సులువుగా తరలించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం దీని ధర 69 వేల 990 రూపాయలు మల్బెర్రీ రెడ్ ఓసియన్ బ్లూ టియర్ ఎల్లో స్పార్క్లింగ్ గ్రీన్ నైట్ స్టార్ బ్లాక్ రంగులు ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది ఓకేనా 100 టీవీఎస్ ఎక్సెల్ 100 తదితర మోడల్ లకు పోటీని ఇవ్వగలరని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

 ప్రత్యేకతలు.. రెండు కిలో  వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ మార్పిడి సౌకర్యం యూఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు 1.2 కిలోవాట్ మీట్ మౌంటెడ్ మోటర్ గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు 150 కిలోల బరువు వరకు మోయగలదు సరకు రవాణా కోసం బ్యాగ్ హుక్స్ .




ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

 అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది? ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలి అంటే

ఫుడ్ పాయిజన్ కావడానికి కలుషిత ఆహారం ప్రధాన కారణం. వండాల్సిన పదార్థాల్ని వంట సామాగ్రిని శుభ్రంగా కడగకపోవడం వంట చేసే వ్యక్తి శుచిగా లేకపోవడం పరిసరాలు అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది అలాగే మాంసాహారం వండిన చోటును సరిగా శుభ్రపరచకుండా అక్కడే కూరగాయల లాంటివి నిల్వ ఉంచితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది ఇందులో ఏ కారణం వల్ల విష తుల్యమైన వాంతులు నీళ్ల విరోచనాలు కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయి అందులోనూ డయేరియాకు గురైనప్పుడు శరీరంలో ద్రవాల స్థాయి తగ్గిపోకుండా చూసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి మజ్జిగ నిమ్మరసం ఎలక్ట్రాన్ పౌడర్ జీలకర్ర నీళ్లు వాము నీళ్ళు సూపులు రాగి జావా సగ్గుబియ్యం లాంటి ద్రవాలు దవాహారాలు తీసుకోవాలి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు తగిన విశ్రాంతి ఇవ్వాలి అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి అరటిపండు ఉడకబెట్టిన చిలకడదుంప మెత్తగా వండిన కిచిడి పెరుగన్నం లాంటివన్నమాట అలాగే కారాలు మసాలాలకు దూరంగా ఉండాలి. ప్రోబయాటిక్స్ తీసుకోవాలి పెరుగు ఇడ్లీ ఈ కోవాలోకి వస్తాయి ఇవి మళ్లీ మన పుట్టలోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి సహకరిస్తాయి ఇక అల్లం మరగబెట్టిన నీళ్లు బ్యాక్టీరియాని పారదోలి జీర్ణకోశానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి కాఫీలు మైదాతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు పండ్ల రసాలు మంచి శక్తినిస్తాయి