3, ఫిబ్రవరి 2024, శనివారం

వాలీబాల్ టోర్నీ విజేత బోర్లామ్ క్యాంప్

 బాన్సువాడ ఉద్దెన గంగప్ప స్మారకార్థం ఇబ్రహీంపేటలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో బోర్లాం క్యాంప్ జట్టు విజేతగా నిలిచింది శుక్రవారం గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కళావతి మాట్లాడుతూ గంగప్ప సర్పంచ్ గా గ్రామానికి ఎంతో సేవ చేశారన్నారు కార్యక్రమంలో ఆనంద్ వినయ్ రాజ్ కుమార్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.



కేబుల్ టీవీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం

 కామారెడ్డి టౌన్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం 2024 ను శుక్రవారం నాడు ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ గా ఆకుల రవిరాజు వైస్ ప్రెసిడెంట్గా చంద్రకాంత్ జనరల్ సెక్రటరీగా భవానిపేట రాజు, సెక్రటరీగా సౌకతలి ట్రెజరర్ గా శేఖర్ యాదవ్ లన ఎన్నుకున్నట్లు తెలిపారు



ఐ ఎం డబ్ల్యు ఎఫ్ అధ్యక్షుడిగా వాసిరెడ్డి సీతారామయ్య

 ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధ నూతన అధ్యక్షుడిగా సింగరేణి కార్మిక నేత వాసిరెడ్డి సీతారామయ్య ఎన్నికయ్యారు జార్ఖండ్ రాజధాని రాంచీలో గురువారం జరిగిన ఫెడరేషన్ ఐ ఎం డబ్ల్యు ఎఫ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఈ ఫెడరేషన్ దేశంలోని 8 కోల్ ఇండియా బొగ్గు పరిశ్రమలతో పాటు సింగరేణి సంస్థలు యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది సింగరేణి విభాగం స్టేట్ అధ్యక్షుడైన సీతారామయ్య ఐ ఎం డబ్ల్యు ఎఫ్ అధ్యక్షుడిగా మూడేళ్ల పాటు కొనసాగని నాయన ఎన్నిక పట్ల ఐఐటియుసి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.