3, ఫిబ్రవరి 2024, శనివారం

అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

 విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్క్ షాప్ లో డీజీపీ రవి గుప్తా

ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని డిజిపి రవి గుప్తా అన్నారు ఈ నేరాల కట్టడికి దేశంలోని తొలిసారిగా రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శుక్రవారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ నేరాలపై అవగాహన వర్క్షాప్ నిర్వహించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వర్క్ షాప్ లో డిజిపి రవి గుప్తా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ తనకు సైతం సైబర్ నేరగాళ్ల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చాయని వెల్లడించారు హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచితే దాదాపు 60 శాతం సైబర్ నేరాలు తగ్గ అవకాశం ఉంది అన్నారు సైబర్ నీరకాల మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాను కోరార కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు విశ్వజిత్ దేవేందర్ సింగ్ ఏసీబీ నుంచి కేవీఎం ప్రసాద్ పాల్గొన్నారు


స్మార్ట్ గౌ.. పల్లె టేకి ఆవిష్కరణ

 


గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మొబైల్ యాప్ ఐ ఐఐటి హైదరాబాద్ పూర్వ విద్యార్థి రూపకల్పన

గ్రామీణ ప్రజలకు వీలుగా ఉండేలా స్మార్ట్ గవ్ యాప్అ భివృద్ధి చేశాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ ఐ టి హైదరాబాదులో ఎంటెక్ చేసిన రజనీష్ వాజ్పాయ్ కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిత స్థిరపడ్డారు. మాతృదేశానికి ఏదైనా చేయాలన్న తపనతో గ్రామీణ భారతదేశ ంలో స్మార్ట్ గవర్నెన్స్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కోసం ఆండ్రాయిడ్ యాప్ రూపొందించారు 2017లో రెండు నెలలపై ఇండియాకు వచ్చి తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆధునిక ప్రపంచంలో గ్రామాలకు ఏం కావాలో తెలుసుకొని ఈ యాప్ ను రూపొందించారని ప్రస్తుతం ఈ యాప్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఐఐఐటి ప్రతినిది  తెలిపారు.


ఐఐటి మద్రాస్ లో స్పోర్ట్స్ కోట

 దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోట అమలు చేయనుంది 2024 25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది ఇందులో ఒకటి జనరల్ న్యూట్రల్ కు ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యుమరరి సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు