3, ఫిబ్రవరి 2024, శనివారం

దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో సత్తా చాటిన జిల్లా ప్రదర్శనలు

 దక్షిణ భారతదేశ వైజ్ఞానిక మేళాలో జిల్లా ప్రదర్శనలు చాటాయి జనవరి 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు విజయవాడలో దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు కామారెడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల చిన్న మల్లారెడ్డి కి చెందిన ప్రవీణ్ కుమార్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించిన లెర్న్ ఫిజికల్ సైన్స్ విత్ ఫన్ అండ్ గేమ్స్ ప్రదర్శన ద్వితీయ స్థానం పొందింది రాష్ట్రం నుంచి 60 వరకు ప్రదర్శించక ప్రవీణ్ కుమార్ కు రెండో స్థానం లభించింది విద్యార్థి వ్యక్తిగత విభాగంలో స్పెషల్ కేటగిరి కింద కొండాపూర్ లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ రావు పర్యవేక్షణలో విద్యార్థి రూపొందించిన ప్రాజెక్టు డ్రైవింగ్ లైసెన్స్ బెస్ట్ ఇగ్నీషియన్ సిస్టం ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థి బబ్లు రూపొందించిన ఇంటలిజెంట్ హెల్మెట్ ఎంపికైంది వారికి వైజ్ఞానిక ప్రదర్శన ప్రతినిధులు సర్టిఫికెట్లను అందజేశారు.



2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

స్ట్రాన్జా పోటీలకు జిల్లా వాసులు..

 బాక్సింగ్ క్రీడలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్ కు జిల్లా నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం బరువుల వారీగా భారత బాక్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేశారు జిల్లా స్టార్ క్రీడాకారిణి  నిఖత్ జరీన్ 50 కేజీల బరువు విభాగంలో పోటీ పడనుండగా ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడిగా జిల్లా వాసి ఎత్త సాముద్దీన్ వ్యవహరించనున్నారు క్రీడల్లో అతికిష్టమైన బాక్సింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అయితే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు శిక్షకుడు మన జిల్లా వాసే కావడం మరో ఘనత ఈ నెల ఒకటి నుంచి 12 వరకు బలిగేరియాలోని సోఫియాలో జరిగే 75 వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాంజా పోటీలకు భారత జట్టుతో పాటు నిఖ్యారి శిక్షకుడు ఎత్తసముద్దీన్ బయలుదేరారు




మహిళా డిగ్రీ కళాశాలలో స్టేట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్

 సదాశివ నగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్ నందు ఈనెల ఐదు ఆరు తేదీలలో స్టేట్ లెవెల్ వైబ్రేషన్ ప్రోగ్రాం కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక తెలిపారు గురువారం లేఖర్ల సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు రెండు రోజులపాటు నిర్వహించబోయే కల్చరల్ ఫెస్ట్లో 24 కాంపిటీషన్స్ లోని వివిధ రకాల సాంస్కృతిక పోటీలలో ఉండే నియమ నిబంధనల గురించి వివరించారు ఈ రకమైన పోటీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీలతోపాటు కామారెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని అన్నారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర రాధిక అధ్యాపకులు, విద్యార్థినిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.