బాక్సింగ్ క్రీడలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్ కు జిల్లా నుంచి ఇద్దరు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం బరువుల వారీగా భారత బాక్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేశారు జిల్లా స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ 50 కేజీల బరువు విభాగంలో పోటీ పడనుండగా ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడిగా జిల్లా వాసి ఎత్త సాముద్దీన్ వ్యవహరించనున్నారు క్రీడల్లో అతికిష్టమైన బాక్సింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అయితే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు శిక్షకుడు మన జిల్లా వాసే కావడం మరో ఘనత ఈ నెల ఒకటి నుంచి 12 వరకు బలిగేరియాలోని సోఫియాలో జరిగే 75 వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాంజా పోటీలకు భారత జట్టుతో పాటు నిఖ్యారి శిక్షకుడు ఎత్తసముద్దీన్ బయలుదేరారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
మహిళా డిగ్రీ కళాశాలలో స్టేట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్
సదాశివ నగర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్ నందు ఈనెల ఐదు ఆరు తేదీలలో స్టేట్ లెవెల్ వైబ్రేషన్ ప్రోగ్రాం కల్చరల్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక తెలిపారు గురువారం లేఖర్ల సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వెల్లడించారు రెండు రోజులపాటు నిర్వహించబోయే కల్చరల్ ఫెస్ట్లో 24 కాంపిటీషన్స్ లోని వివిధ రకాల సాంస్కృతిక పోటీలలో ఉండే నియమ నిబంధనల గురించి వివరించారు ఈ రకమైన పోటీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీలతోపాటు కామారెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని అన్నారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వీర రాధిక అధ్యాపకులు, విద్యార్థినిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
క్రీడా కారిణి ని సన్మానించి న ఐ టీ శాఖా మంత్రి
తక్కడపల్లి గ్రామానికి చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ప్రతిభా పాటిల్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కేమ్రాజ్ కళ్యాణి సర్పంచ్ రమేష్ తో కలిసి గురువారం సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలికలు క్రీడలలో రాణించడం గొప్ప పరిణామమని కొనియాడారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆటలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు క్రీడలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవచ్చని తెలిపారు.


