1, ఫిబ్రవరి 2024, గురువారం

గురుకుల పరీక్ష విద్యార్థులకు మోడల్ టెస్ట్

 గురుకుల పరీక్ష విద్యార్థులకు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు బాన్సువాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వైయస్సార్ ఫౌండేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్షలు విద్యార్థులకు అవగాహన భయం పోగొట్టేందుకు ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి కీర్తి జూనియర్ కళాశాలలో ఆదివారం నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేర్కొన్నారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షలు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుందని అన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7 3 8 6 9 6 5 6 0 1 నెంబర్ కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా నాయకులు రొటే సాయిలు వాగ్మారే బాల్రాజ్ కుమ్మరి సాయికుమార్ కల్లేటి సాయిలు దర్శనం పరువయ్య రాజు తదితరులు పాల్గొన్నారు



ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షునికి ఘన సన్మానం

 నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గ సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘ కార్యవర్గం ఇటీవల జరిగిన ఆలిండియా ఫెడరేషన్ ఆర్చరీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఈగ సంజీవరెడ్డిని జిల్లా టిఎన్జీవో భవనంలో బుధవారం ఘనంగా సన్మానించారు





రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక

 కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి  రగ్బీ  పోటీ ల కు జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి కాకతీయ విద్యార్థులైన సంజన లోకేష్ రెడ్డిలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ తెలిపారు ఎందుకైనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు