1, ఫిబ్రవరి 2024, గురువారం

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక

 కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి  రగ్బీ  పోటీ ల కు జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి కాకతీయ విద్యార్థులైన సంజన లోకేష్ రెడ్డిలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ తెలిపారు ఎందుకైనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు



నేటి నుంచి పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళ

 హైదరాబాద్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నారు బుధవారం సంస్థ నిర్వాహకులు మేళా ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు జరగనున్న ఎగ్జిబిషన్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగనున్న పూల మొక్కల ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మూడు రూపాయల నుంచి 16 లక్షల వరకు విలువగల అరుదైన మొక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు



ప్రాణ రక్షణ నైపుణ్యాలపై శిక్షణ

 ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శన

ముత్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక సభాస్థలిలో బుధవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డ్ ఇండియన్ ఇమ్యునాలజీ లిమిటెడ్ వారి ప్రాజెక్టు సంయుక్తంగా కలిసి మత్స్యకారుల ప్రాణరక్షణ నైపుణ్యాలపై శిక్షణ అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సదస్సులు జిల్లా మత్స్య శఖ అధికారి రాజ్ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అంతకుముందు ఎన్ ఎఫ్ డి పి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి మాట్లాడుతూ శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున వృత్తిరీత్యా మత్స్యకారులు జాలరులు చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు అదేవిధంగా గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం గురించి వివరించారు మాదా సమయంలో తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలపై ఐటీయూఎస్ ఇండియన్ రెస్క్యూ అకాడమీ మహేష్ వారి బృందం ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శించారు కార్యక్రమంలో జిల్లా ఏడి రాజనర్సయ్య ఎస్ఎఫ్ఐసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి ఐ టి యు ఎస్ ఇండియన్ రేస్ కి అకాడమీ మహేష్ సోంపేట నారాయణ జిల్లా మత్స్య శాఖ సిబ్బంది ఎన్ఎఫ్టిపి బృందం మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు