1, ఫిబ్రవరి 2024, గురువారం

నేటి నుంచి పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళ

 హైదరాబాద్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నారు బుధవారం సంస్థ నిర్వాహకులు మేళా ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వరకు జరగనున్న ఎగ్జిబిషన్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగనున్న పూల మొక్కల ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మూడు రూపాయల నుంచి 16 లక్షల వరకు విలువగల అరుదైన మొక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు



ప్రాణ రక్షణ నైపుణ్యాలపై శిక్షణ

 ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శన

ముత్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక సభాస్థలిలో బుధవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డ్ ఇండియన్ ఇమ్యునాలజీ లిమిటెడ్ వారి ప్రాజెక్టు సంయుక్తంగా కలిసి మత్స్యకారుల ప్రాణరక్షణ నైపుణ్యాలపై శిక్షణ అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సదస్సులు జిల్లా మత్స్య శఖ అధికారి రాజ్ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అంతకుముందు ఎన్ ఎఫ్ డి పి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి మాట్లాడుతూ శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున వృత్తిరీత్యా మత్స్యకారులు జాలరులు చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు అదేవిధంగా గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం గురించి వివరించారు మాదా సమయంలో తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలపై ఐటీయూఎస్ ఇండియన్ రెస్క్యూ అకాడమీ మహేష్ వారి బృందం ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శించారు కార్యక్రమంలో జిల్లా ఏడి రాజనర్సయ్య ఎస్ఎఫ్ఐసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి ఐ టి యు ఎస్ ఇండియన్ రేస్ కి అకాడమీ మహేష్ సోంపేట నారాయణ జిల్లా మత్స్య శాఖ సిబ్బంది ఎన్ఎఫ్టిపి బృందం మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు



వ్యాయామ ఉపాధ్యాయుడికి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు

 గాంధారి గ్రామీణ ప్రాంత విద్యార్థులను నిరంతరం క్రీడా శిక్షణ ఇస్తూ వాలీబాల్ షూటింగ్ బాల్ లో ఎంతో మందిని జాతీయ స్థాయి వరకు రాణించేందుకు కృషి చేస్తున్న పోతంగల్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రస్థాయి అవార్డును నిర్మల్ జిల్లాలో మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఫుడ్ బ్యాంక్ వారు అందజేసినట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిరంతరం కొనసాగిస్తూ గ్రామీణ విద్యార్థులకు క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారు దానితోపాటు 2017 సంవత్సరంలో మా అన్న పేరుతో బామ్మనాయక స్పోర్ట్స్ ఫౌండేషన్ 892 పబ్లిక్ 2017 ను స్థాపించి దాని ద్వారా క్రీడా సదుపాయాలు క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడా సౌకర్యాలు పల్లెటూరి విద్యార్థులకు అందిస్తున్నందుకు రాష్ట్రస్థాయి అవార్డు ఇచ్చినట్లు ఆయన తెలిపారు క్రీడల అభివృద్ధికి గాను గతంలో పలుమార్లు స్వచ్ఛంద సంస్థలు జాతీయస్థాయి అవార్డులు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు శ్రీ సాయి అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు అశోక్ స్థానిక నాయకులు పాల్గొన్నారు