1, ఫిబ్రవరి 2024, గురువారం

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థుల ఎంపిక

 యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగబోయే రెడ్డి పోటీలకు కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామ పరిధిలోని శాంతినికేతన్ విద్యాలయం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు రిషిక దివ్య అభిలాష్ రిషిత్ గౌడ్ ఈ నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి వ్యాయామ ఉపాధ్యాయులు రాజు శివాజీ అభినందించారు.



ఆరు విభాగాల్లో బంగారు వెండి పథకాలు

 తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుండి 30 వరకు బుద్వేల్ లో 30 డిగ్రీ కళాశాలలకు స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల నిజామాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన పాలకూర విద్యార్థులు సత్తా చాటారు మొత్తం ఆరు విభాగాల్లో బంగారు వెండి బహుమతులు కైవసం చేసుకున్నారు టెన్నికాయిట్లో బంగారు పథకం త్రిష ప్రియతమ టేబుల్ టెన్నిస్లో వెండి పథకం సాయి ప్రసన్న హై జంప్లో బంగారు పతకం రంజిత రిలే మీటర్ బంగారు పతకం 3000 మీటర్ 800 మీటర్ వెండి పతకం రోజా గెలుపొందారు గెలుపొందిన విద్యార్థినులకు వారికి శిక్షణను ఇచ్చిన పిఈటిలను ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయులు అభినందించారు



వాలీబాల్ విజేత మగ్గిడి జట్టు

 ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఉపకాల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో అండర్ 17 జిల్లా స్థాయిలో బాలబాలికలకు ఒకరోజు వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించారు వాలీబాల్ పోటీలలో జడ్పీహెచ్ఎస్ మగిడి జట్టు బాలికలు ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో కలిగోట్ జడ్పీహెచ్ఎస్ బాలుర విభాగంలో జడ్పీహెచ్ఎస్ పోచంపాడు ప్రథమ ద్వితీయ స్థానం కాకతీయ ఉన్నత పాఠశాల నిజామాబాద్ జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా బాలురకు కబడ్డీ పోటీలు సైతం చేపట్టారు ఇందల్వాయి జట్టు ప్రథమ బాల్కొండ కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు గెలుపొందిన జట్లకు ప్రథమ జట్టుకు పదివేల రూపాయలు ద్వితీయ జట్టుకు 5000 రూపాయలతో పాటు షీల్డ్లను అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు భూమేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు సామ వెంకటరెడ్డి బద్దం నరసారెడ్డి మోత గంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ టి సాయన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య పుష్ప నాథ్ గోపీనాథ్ జిల్లా కమిటీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే గంగాధర్ పిడి రాజకుమార్ మల్లేష్ గౌడ్ పీఈటీలు పాల్గొన్నారు