30, జనవరి 2024, మంగళవారం

టిపిజెఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

 టీ పి జేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం 2024 ఎన్నిక

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం సుందరయ్య కళానిలయంలో జరిగింది కొత్త 33 జిల్లాల కమిటీ సభ్యులు పాత పది జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొత్తం 53 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 40 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గౌరీ సతీష్ 27 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల బోధనా రుసుము బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.



క్రీడాకారిణులకు సన్మానం

 భిక్కనూరు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14 విభాగం జాతీయ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను జంగంపల్లి సర్పంచి నర్సింలు యాదవ్ సన్మానించారు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కల్పన మానస లను సన్మానించి అభినందించారు ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఎం జె పి ప్రిన్సిపల్ ప్రమోద వార్డు సభ్యుడు సంతోష్ ప్రదీప్ రమేష్ పాల్గొన్నారు.



రెండున వివేక స్ఫూర్తి జిల్లా స్థాయి పోటీలు

 స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం రోజున జిల్లా కేంద్రం శివాజీ నగర్ రామకృష్ణ విద్యానికేతన్ లో జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రథమ బహుమతి 5000 రూపాయలు ద్వితీయ బహుమతి మూడువేల రూపాయలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు ఆసక్తి గలవారు 9.2 9 0 4 4 9 3 8 9 నెంబర్లు సంప్రదించాలని తెలిపారు. నిజామాబాద్ ..