2, మార్చి 2024, శనివారం

ఆధ్యాత్మిక వార్తలు మార్చి 2 2024

 రేపు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రకాష్ తెలిపారు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వచ్చిన భక్తుల కోసం అన్నదానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సూచించారు

వైభవంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవము

మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి నవగ్రహ పూజ అమ్మవారికి ప్రత్యేక మహాభిషేకము కుంకుమ పూజ పేద పండితుల మంత్రోచ్ఛారణలతో యాగం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

బిచ్కుందలో స్థానిక రంగర్ గల్లీలోని మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యాలు సమర్పించారు అనంతరం అన్నదానం చేశారు

శివరాత్రి వేడుకలకు ఆహ్వానము తాండూరు గ్రామంలోని సుప్రసిద్ధ త్రిలింగ రామేశ్వర ఆలయంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ గార్లను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు ఎంపీపీ రాజదాసు సొసైటీ చైర్మన్ ఆర్కిడి గంగారెడ్డి సభ్యులు రమేష్ సాయిలు రాజశేఖర్ తదితరులు ఉన్నారు

తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు నాయకులు సాయికిరణ్ పోచిగుండా యోగేశ్వర రాజు తదితరులు ఉన్నారు

మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామ శివారులోని పటేల్ చెరువు మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం బోనాలు నిర్వహించారు పట్టు వస్త్రాలు పూలదండలు నైవేద్యాలు సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు

బారడి పోచమ్మ పండుగ చించోలిలో శుక్రవారం భారతి పోచమ్మ పండుగను గ్రామస్తులు నిర్వహించారు స్థానిక హనుమాన్ ఆలయం నుంచి మహిళలు బోనాలు మంగళహారతులతో ఊరేగింపు చేపట్టారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు





1, మార్చి 2024, శుక్రవారం

బార్లీ తో బోలెడన్ని సమస్యలు దూరము

 పూర్వం ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికి బార్లీ నీళ్లు సగ్గుజావా తాగించే వాళ్ళు పెద్దలు ఇప్పుడు కూడా బార్లీ కనిపిస్తోంది కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే కేవలం జ్వరంలోనే కాదు వేసవిలో బార్లీ వాడకం చాలా మంచిది అది ఎలాగో చూద్దాం. వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది అజీర్తి దూరమవుతుంది పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగవలసింది మధుమేహంలకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు రోజుల ఉదయము సాయంత్రము బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి మహిళలను తరచు బాధించే ప్రధాన సమస్య మూత్రణాల ఇన్ఫెక్షన్ ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజు గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు వ్యర్ధాలు బయటకు పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి



పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురి

 ఒకప్పటి నిజాం రాజు షికార్ఘర్ ఇప్పటి టూరిస్ట్ స్పాట్ ఇక్కడ కృష్ణ జింకల గుంపులతో పాటు నీలుగా సాంబార్ నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళను చూడవచ్చు వీకెండ్స్ లో పిల్లలతో కాసేపు హాయిగా గడపాలి అనుకునే వాళ్లకు పోచారం వైల్డ్ లైఫ్ షాంపుచూరి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది



ఉదయం నుంచి రాత్రి వరకు పని ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లకు మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ .ఇది మెదక్ కామారెడ్డి జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఉంది నిజాము కాలంలో షికార్గరిగా పేరుందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఫేమస్ పిక్నిక్ స్పాట్ పోచారం శాంకచురీ లో రెండు డీర్ బ్రీడ్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని వందల కృష్ణ జింకలు ఉన్నాయి అభయారణ్యంలో అవి గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. వీటితోపాటు నీల్ గాయ్  , సాంబార్ ,నెమళ్లు కొండ గొర్రెలు ముళ్ళ పందులు కుందేళ్ళు వంటి వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి శాంక్చురి లోపల వెహికల్లో తిరగవచ్చు అభయారణ్య మందాలను చూసేందుకు రెండు వాచ్ టవర్లు ఉన్నాయి శాంక్ చూరి ఎంట్రన్స్ లో విజిటర్స్ కాసేపు రెస్టు తీసుకునేందుకు పార్కు ఉంది ఆకర్షణీయంగా ఉండే రకరకాల పచ్చని చెట్లతో పాటు ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చునేందుకు వీలుగా బెంచీలు భోజనాలు చేసేందుకు షెడ్డు మంచినీళ్లు ఉన్నాయి పార్కు దగ్గరలో అటవీశాఖ వాళ్ళు 50 లక్షల రూపాయలతో పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మించారు ఇందులోకి వెళ్లే వన్యప్రాణుల జీవన విధానం గురించి అవగాహన కలుగుతుంది ఆదివారాలు సెలవు రోజులలో మెదక్ కామారెడ్డి జిల్లా నుంచి ఫ్యామిలీస్ తో ఇక్కడికి వస్తారు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్కూల్స్ కాలేజీ స్టూడెంట్స్ విజ్ఞాన యాత్రలో భాగంగా పోచారం  శాంక్చురీ కి వస్తారు 





అడవిలో అర్బన్ పార్క్.. ఆకర్షణీయమైన ఎంట్రన్స్ లు ఆకట్టుకునే గజిబోలు ఎత్తైన వాచ్ టవర్లతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది మెదక్ జిల్లా నరసాపూర్ అర్బన్ ఫారెస్ట్.. హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే లో అనుకోని ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్ లో 20 కోట్ల రూపాయల వ్యయంతో 200765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ డెవలప్ చేశారు అడవిచుట్టు ఏడు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు అర్బన్ పార్కులోకి వెళ్లేందుకు రెండు మెయిన్ గేట్లు ఉన్నాయి అడవి అందాలను చూడడం కోసం 60 ఫీట్ల ఎత్తులు రెండు వాచ్ టవర్లు కట్టారు విజిటర్స్ కాసేపు రెస్ట్ తీసుకునేందుకు ఒక గజబు ఏర్పాటు చేశారు కలపలా కనిపించే కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ విజిటర్స్ కూర్చునేందుకు ఎత్తైన బండమీద సిమెంట్ బెంచీలు నీరు పారే ప్రాంతాలలో బ్రిడ్జిలు కట్టారు. అర్బన్ పార్కును నడిచి చూసేందుకు వీలుగా మట్టి రోడ్లు వేశారు సైకిల్ ఎక్కి కూడా చేయవచ్చు ఆదివారాలు ఇతర సెలవు రోజులలో ఎక్కువ మంది విజిటర్స్ హైదరాబాద్ నుంచే వస్తారు ఇక్కడికి