రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడులోని కొడియాతుర్ గ్రామస్తులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు బిరియాని స్వీట్లు వడ్డించారు రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు వరుడు రోడ్డు ఎవరు అని అడిగారు సుమా అక్కడ అలాంటివి ఏమీ ఉండవు కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు 1200 మీటర్ల పొడవు మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది దీనిని 1980లో నిర్మించారు అనంతరం ఆ గ్రామ జనాభా మూడు రెట్లు పెరిగింది వాహన రాకపోకలు సైతం భారీగా పెరిగాయి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నారు అయినా కొన్ని కారణాలవల్ల కుదరడం లేదు ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు వారికి పరిహారం రహదారి నిర్మాణానికి 60 లక్షల రూపాయలు అవుతాయని అంచనా వేశారు ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు గ్రామానికి చెందిన 15 మంది ముందుకు వచ్చి ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున 15 లక్షల రూపాయల విరాళాలు అందించారు ఇంకా వారికి 45 లక్షల రూపాయల అవసరం అప్పుడే వారికి పనం పయట్టు లేదా కురి కళ్యాణం గుర్తుకొచ్చింది ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నీతులు సమీకరిస్తారు ఇప్పుడు కొడియాతూరు గ్రామస్తులు సైతం నిధుల కోసం పనం పయట్టు కింద రహదారికి పెళ్లి చేశారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
అక్షరాలలో ఫోన్ సంభాషణలు
ట్రూ కాలర్ సరికొత్త ఫీచర్
కాలర్ వివరాలను తెలిపే యాప్ ట్రూ కాలర్ తాజాగా సంచలన ఫీచర్ను జోడించింది ప్రీమియం కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్ను జత చేసింది ఇది కాల్ రికార్డింగ్ తో పాటు మాట్లాడిన మాటలను అక్షర రూపం చేస్తుంది ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ భాషలకు ఈ టీచర్ పరిమితం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వివరాలతో కూడిన సమ్మరీ కూడా ప్రత్యక్షం అవుతుంది.
26, ఫిబ్రవరి 2024, సోమవారం
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ తెలిపారు వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేక్ ఎ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లి స్మార్ట్ అని థీమ్తో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ప్రధానంగా పొదుపు చక్రవడ్డీ శక్తిపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు స్లోగన్లు డిజిటల్ సైబర్ భద్రత పోస్టర్ రూపకల్పన అనే అంశాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానం నుండి ప్రగతి హాస్పిటల్ వరకు 2కె నడక 28న ఆర్థిక అక్షరాస్యత శిబిరము 29న అన్ని పాఠశాలలు కళాశాలలో విద్యార్థులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతపై ప్రసంగాలు కార్యక్రమాలు ఉంటాయని ఎల్డీఎం వివరించారు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యుటి కిరణ్మయి జెడ్పి సీఈవో ఉషా తదితరులు పాల్గొన్నారు