7, ఫిబ్రవరి 2024, బుధవారం

డీప్ ఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు దోపిడీ

 డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నీరగాళ్లు ఓ మల్టీ నేషనల్ కంపెనీ నుంచి 2007 కోట్ల రూపాయలు కొట్టేశారు ఆ కంపెనీకి చెందిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖాన్ని డీప్ ఫేక్ చేశారు ఆపై వీడియో కాల్ చేసి వ సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటూ అకౌంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఆదేశించారు దీంతో సిబ్బంది ఆయన చెప్పిన అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు పక్కా ప్లాన్ చేసిన నేరగాళ్లు వారం రోజుల్లో ఈ దోపిడీ ఎపిసోడ్ ను ముగించారు ఆపై తేరుకున్న కంపెనీ సిబ్బంది తమ మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ అతిపెద్ద డీప్ ఫేక్ మోసం కంపెనీకి చెందిన హాంకాంగ్ బ్రాంచ్లో టీవల జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది

వీడియో కాల్ చేసి నమ్మించారు స్కామర్లు పక్కాగా స్కెచ్ వేశారు కంపెనీకి చెందిన మెయిన్ బ్రాంచ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తో పాటు కీలక సిబ్బంది ముక్కాలను డీప్ ఫేక్ చేశారు వాళ్ళ మాట తీరును మక్కికి మక్కి కాపీ కొట్టారు ఆపై క్యాష్ వ్యవహారాలు చూసుకుని హాంగ్కాంగ్ బ్రాంచ్ లోని అకౌంటెంట్ కు వీడియో కాన్ఫరెన్స్ కలిపారు అంతకుముందే సీక్రెట్ ఆపరేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని మెయిల్ ద్వారా అతన్ని అలర్ట్ చేశారు గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుతున్న బాస్ తో సహా మిగతా టీమ్ అంతా తమ కంపెనీ వాళ్ళే కావడంతో అకౌంటెంట్ కు ఏ మాత్రం అనుమానం రాలేదు. వీడియో కాల్ లో వాళ్ళు చెప్పినట్లే ఐదు అకౌంట్లకు 27 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంపెనీ హెడ్ ఆఫీస్ కు వెళ్లగా తనను మోసం చేశారని పేర్కొని పోలీసులను ఆశ్రయించారు అయితే ఆ కంపెనీ పేరు ఏంటో కూడా వెల్లడించని పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేకపోయారని మీడియా రిపోర్ట్ తెలిపింది.



భారత్ రైస్ అమ్మకాలు షురూ

 



కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యాపతులు భారత రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పియుష్ గోయల్ ప్రారంభించారు భారతదేశ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయల చొప్పున ఐదు పది కిలోల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి మొదటి పేజీలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైసును విక్రయిస్తారు ఇందుకోసం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనున్నది. భారత రైస్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుంది



రెస్టారెంట్లో ఎలా ఉండాలి?

 రెస్టారెంట్ లో ఎలా ఉండాలి?

ఫాన్సీ రెస్టారెంట్ కి వెళ్లాలంటే డైనింగ్ నియమాలు తెలిసి ఉండడం అవసరం ఆ నియమాలు ఏమిటంటే

టేబుల్ పైన ఫోన్ తాళాలు పర్సు లాంటివి ఉంచకూడదు. ఆతిథ్యం ఇస్తున్నది మీరైతే ఒక అడుగు ముందే బిల్ చెల్లించాలి.

 ఆర్డర్ చేసే అవకాశం అతిథికే ఇవ్వాలి.

 అందంగా తయారవడం ముఖ్యమే.

 వెయిటర్ మీద కోప్పడడం లాంటివి చేయకూడదు.

 సంభాషణ మృదువుగా సాగాలి.

 కలిసి వచ్చిన వ్యక్తి భోజనాన్ని రుచి చూడడం కోసం చేతులను టేబుల్ అవతలి వైపుకు చాపి పదార్థాలను అందుకోకూడదు .

కంపానియన్ ఆర్డర్ చేసిన వాటికంటే ఎక్కువ కోర్సులు ఆర్డర్ చేయకూడదు. 

సరిగా ఉడకని పదార్థాలను తిప్పి వెనక్కి పంపవచ్చు.

 న్యాప్ కిన్ ఒళ్లో  ఉంచుకోవాలి..

ప్రతిసారి సాల్ట్ , పెప్పర్లు రెండింటిని కలిపి అందించాలి.