3, ఫిబ్రవరి 2024, శనివారం

కవితా రెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్ పర్సన్ కవిత రెడ్డి

 సమాజసేవే మా ఫౌండేషన్ ధ్యేయం తెల్ల  రేషన్ కార్డు కలిగిన వారికి వంద రూపాయలకే అవుట్ పేషెంట్ వైద్యం

సమాజసేవే తమ ఫౌండేషన్ ధ్యేయమని నిజామాబాద్ ప్రజలకు తక్కువ రాయితీతో తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందజేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కవితా రెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్ పర్సన్ కవితా రెడ్డి తెలిపారు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ సాయి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత రెడ్డి హెల్త్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ కవిత  మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి హాస్పిటల్ ద్వారా వైద్యరంగంలో సేవలు అందిస్తున్నామని అన్నారు నిజామాబాద్ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ రాయితీతో వైద్య సేవలను అందజేస్తున్నామని పేర్కొన్నారు ఎందుకు సంబంధించి ఐడి కార్డులను అందజేశారు 25 ఏళ్లుగా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు అంతేకాకుండా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు రక్తహీనత కౌమార దశ సంబంధించిన సమస్యలపై అవగాహన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్యం పై అవగాహన సదస్సులను హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు శ్రీ సాయి హాస్పిటల్స్ స్థాపించి 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు సంకల్పించామని అన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వంద రూపాయలకే ఓపి వైద్యం అందిస్తున్నాము కేవలం ఓపి కాకుండా ఇతర వైద్య సేవలు శాస్త్ర చికిత్సలు రాయితీపై వైద్య సేవలు అందజేస్తామని పేర్కొన్నారు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందుబాటులో తీసుకు వస్తున్నాను అన్నారు గైనకాలజీ తో పాటు పీడియాట్రిక్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు 25 ఏళ్లుగా ఐద్య సేవలో ముందంజలో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు




కామారెడ్డి జిల్లా తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ 2024

 కామారెడ్డి జిల్లా తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ 2024 ప్రిన్సిపాల్ అసోసియేషన్ 2024 

ప్రెసిడెంట్ - శ్రీనాథ్

 ప్రిన్సిపాల్ అసోసియేషన్ ట్రెజరర్ -  బుద్ధి  రాజు

 జిల్లా అధ్యక్షులు -  అక్కం విష్ణు

 ప్రధాన కార్యదర్శి - రామకృష్ణారెడ్డి 

రాష్ట్ర ఉపాధ్యక్షులు - ఫణి కుమార్, గంగాధర్

 వర్కింగ్ ప్రెసిడెంట్ - అల్లంపల్లి శ్రీనివాస్ 

కోశాధికారి - శ్రీనివాసరావు

 మహిళా కార్యదర్శి -  రోహిణి, సరిత

 జిల్లా నాయకులు -  రమేష్ రావు ,సాయినాథ్ ,సాయిలు తిరుపతి గౌడ్ ,రాములు ,సుధాకర్ ,మురళి, శ్రీకాంత్.



రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థి మాలతి ఎంపిక

 రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాలతి ఎంపికయ్యారు ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో 76 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది ఈనెల 3 4 5 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో జరిగే అండర్ 17 పోటీల్లో పాల్గొన్నట్లు ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ బలరాం ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.