3, ఫిబ్రవరి 2024, శనివారం

స్వర్ణకార సంఘం ఎన్నికలు

 బోధన్ పట్టణంలోని విశ్వకర్మ భవనంలో శుక్రవారం స్వర్ణకార సంఘం  2024 ఎన్నికల నిర్వహించారు ఎన్నికల్లో

 అధ్యక్షులుగా - శ్రీపాదోజ్వార్ జనార్ధన్

 ప్రధాన కార్యదర్శిగా - త్రివేణి నాగరాజు చారి

 కోశాధికారిగా - మల్లేశ్వరం నారాయణ చారి

 ఉపాధ్యక్షులుగా - బొప్పాపురం హనుమాన్ చారి 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో 

జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు - తంగళ్ళపల్లి శ్రీనివాసచార, 

కమిటీ సభ్యులు - మారోజు మురహర చారి, మారోజు సుధాకర్ చారి, సుంకోజు హరికాంత్ చారి ,కన్నోజ్వర్ బాలాజీ చారి ,సల్లూర్ వార్ అశోక్ చారి, కాళిదాస్ చారి, ప్రభాకర్ చారి ,నా రోజు రమణాచారి, ఎర్రోజు భాస్కరాచారి ,రాజశేఖర్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.



కాంతి హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్

 ఆర్మూర్ పట్టణంలోని కాంతి హై స్కూల్ శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు ఈ సందర్భంగా కాంతి హై స్కూల్ కరస్పాండ్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను వంట గదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అలాగే వ్యాపార విలువలు మరియు లాభనష్టాల పేరేజ్ గురించి పిల్లలకు ఈ వయసులోని అవగాహన వచ్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో 100కు పైగా చెట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



కేవైసీ మోసాలతో జాగ్రత్త ఆర్బిఐ హెచ్చరిక

 నో యువర్ కస్టమర్ కేవైసీ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది స్కామర్లు ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ తో బాధితుల వ్యక్తిగత సమాచారం ఖాతా వివరాల వంటివి చోరీ చేస్తున్నారు మోసగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్ పంపి కస్టమర్లు ఆందోళన పడేలా చేస్తారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుంటే ఖాతా రద్దు అవుతుందని భయపెడతారు. దీంతో బాధితుడు భయపడి మొత్తం సమాచారం ఇస్తాడు ఫైనాన్షియల్ సైబర్ మోసాలు జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆర్పిఐ తెలిపింది కేవైసీ అప్డేషన్ కోసం ఏదైనా రిక్వెస్ట్ వస్తే నిర్ధారణ కోసం నేరుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలని పేర్కొంది ఆర్థిక సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఖాతా లాగిన్ వివరాలు వెరిఫై కానీ యాప్లను ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆర్బిఐ తెలిపింది